ఏపీ దేవాదాయ శాఖ మంత్రి - బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు షాకింగ్ డెసిషన్ ప్రకటించారు. హైదరాబాద్ తమ రాజధాని కాదని.. తాను అక్కడ ఉండబోనని స్పష్టం చేశారు. అంతేగాక, తనకు అక్కడ నివాసం కూడా అవసరం లేదుటూ తన అధికారిక నివాసాన్ని వదులుకున్నారు. దీంతో మిగతా మంత్రులు - సీఎం అంతా ఆశ్చర్యపోతున్నారు.
దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు 2014లో బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో 27వ నెంబర్ క్వార్టర్ ను కేటాయించారు. ఇతర మంత్రులందరూ తమ హైదరాబాద్ నివాసాన్ని కొనసాగిస్తుండగా.. మాణిక్యాలరావు మాత్రం తనకు వద్దంటూ ప్రభుత్వానికి లేఖరాశారు. దీంతో ఆ క్వార్టర్ కేటాయింపును రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ - గుంటూరు పరిసరాల్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాస వసతి కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబే హైదరాబాద్ లో భారీ భవంతి నిర్మించుకుని ఇటీవలే అందులోకి మారారు. కానీ.. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి మాత్రం తనకు హైదరాబాద్ నివాసం వద్దని చెప్పిడంతో చంద్రబాబు సహా మిగతా మంత్రులు అంతా ఇరకాటంలో పడినట్లైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు 2014లో బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో 27వ నెంబర్ క్వార్టర్ ను కేటాయించారు. ఇతర మంత్రులందరూ తమ హైదరాబాద్ నివాసాన్ని కొనసాగిస్తుండగా.. మాణిక్యాలరావు మాత్రం తనకు వద్దంటూ ప్రభుత్వానికి లేఖరాశారు. దీంతో ఆ క్వార్టర్ కేటాయింపును రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ - గుంటూరు పరిసరాల్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాస వసతి కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబే హైదరాబాద్ లో భారీ భవంతి నిర్మించుకుని ఇటీవలే అందులోకి మారారు. కానీ.. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి మాత్రం తనకు హైదరాబాద్ నివాసం వద్దని చెప్పిడంతో చంద్రబాబు సహా మిగతా మంత్రులు అంతా ఇరకాటంలో పడినట్లైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/