ఆస్పత్రి లో చేరిన కృష్ణం రాజు!

Update: 2019-11-14 05:18 GMT
టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణం రాజు (79) ఆస్పత్రి లో చేరినట్లు తెలిసింది. ఆయన ఆరోగ్యం దెబ్బ తినడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి నిన్న రాత్రి తీసుకెళ్లారు.

ప్రస్తుతం బీజేపీ పార్టీ లో కృష్ణం రాజు ఉన్నారు. గతంలో కేంద్రమంత్రి గా కూడా సేవలందించారు. సినిమాల్లో ఆడపా దడపా కనిపిస్తూనే ఏపీ పాలిటిక్స్ లో  కనిపిస్తున్నారు.

కృష్ణం రాజు కొద్దికాలం గా న్యూమోనియా తో బాధ పడుతున్నారు. వయోభారంతో ఈ మధ్య చురుకుగా  ఎక్కడా పాల్గొనడం లేదు.  హైదరాబాద్ లో చలికాలం మొదలు కావడంతో ఆయనకు నిన్న రాత్రి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారిందట.. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కృష్ణం రాజు ను బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి కి తీసుకెళ్లారు. కృష్ణం రాజును డాక్టర్లు ఐసీయూ లో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ప్రస్తుతం కృష్ణం రాజు కోలుకుంటున్నట్టు తెలిసింది. ఆయన సజావుగా ఊపిరి తీసుకుంటుండడంతో ఈరోజు జనరల్ వార్డ్ కు మార్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా ను కృష్ణం రాజు నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మాతగా సినిమా తీస్తున్నారు.
Tags:    

Similar News