కేసీఆర్ స‌ర్కార్ ఓటాన్ బ‌డ్జెట్ హైలెట్స్‌

Update: 2019-02-22 07:51 GMT
గురువారం ఉద‌యం 11.20 గంట‌ల‌కు తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు షురూ అయిన‌ప్ప‌టికీ.. 12.12 గంట‌ల వేళ‌లో కేసీఆర్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని షురూ చేశారు. రానున్న ఆర్నెల్ల కాలానికి త‌గ్గ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. ఈ బ‌డ్జెట్ లో ముఖ్యాంశాల్ని చూస్తే..

+  తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అన్ని రంగాలకు 24గంటల పాటు విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం. వ్యవసాయ రంగంలో అడ్డంకులను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ రైతుల్లో నైరాశ్యాన్ని తొలగిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది.  ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది.  మరోసారి ప్రజలు తెరాసకు అధికారం ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటారు.

+  2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైంది. పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు.. ఒంటరి మహిళలు - బీడీ కార్మికలు - బోధకాలు వ్యాధిగ్రస్తులు - నేత - గీత కార్మికులు - ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని - రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నాం.దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం.  వృద్ధాప్య పింఛన్‌ కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి - పెంచిన పింఛను అందిస్తాం. టీఎస్ ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు వ‌చ్చాయి. టీఎస్ ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. మొత్తంగా  8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

+  విద్యుత్‌ సంక్షోభాన్ని తెలంగాణ చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది.  మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది.  దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో మనరాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. విద్యుత్‌ వినియోగం వృద్ధిరేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణం.

+  ఏప్రిల్‌ చివరి నాటికి మిషన్‌ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తాం. మరో రెండు నెలల్లో ఇంటింటింకి నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తాం నిరుపేదలకు గృహ నిర్మాణపథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.  ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం  340 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం. ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయం.

=  ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌ లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం.
=  2019-20 సంవత్సారానికి మొత్తం బడ్జెట్‌ రూ.1,82,017కోట్లు
=  రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
=  మూలధన వ్యయం రూ.32,815కోట్లు
=  రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు
=  కల్యాణలక్ష్మి - షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
=  నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
=  ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
=  ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
4
=  మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు

+  రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు
+  బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
+  రైతు బీమా కోసం రూ.650కోట్లు
+  రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు. ఇందుకు రూ.12వేల కోట్లు
+  వ్యవసాయశాఖకు రూ.20,107కోట్లు.

=  ఎంబీసీ కార్పొరేషన్‌ కు రూ.1000 కోట్లు
=  నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు
=  ఈఎన్‌ టీ - దంత పరీక్షలు రూ.5,536కోట్లు
=  పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు
=  ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు
=  500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు
=  వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లు
=  బీసీల కోసం 119 గురుకులాల ఏర్పాటు.


Tags:    

Similar News