మాజీ ఎమ్మెల్సీని గౌర‌వించిన వైఎస్ జ‌గ‌న్‌

Update: 2017-02-22 16:10 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  గ్రేట‌ర్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అధ్య‌క్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ను నియ‌మించారు.  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేర‌కు ఈ మేర‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ - రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ల‌ను గ్రేట‌ర్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంగా గుర్తిస్తూ ఈ నియామ‌కం చేప‌ట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కందుల దుర్గేష్ కొద్దికాలం క్రితం వైసీపీ  కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

కాగా, కాపు సామాజికవర్గానికి చెందిన కందుల దుర్గేష్‌ కు రాజమహేంద్ర‌వ‌రంలో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ లో కొసాగుతున్న స‌మ‌యంలో  కొద్దికాలం క్రితం కార్యకర్తలతో సమావేశమైన కందుల వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యకర్తలంతా కాంగ్రెస్‌ ను వీడి వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో కందుల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కందుల గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కందుల దుర్గేష్ కాంగ్రెస్‌ కు రాజీనామా చేయ‌డంతో తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయినట్టేనని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News