రామలింగారెడ్డికి అసలైన నివాళి అదే: జగ్గారెడ్డి

Update: 2020-08-06 17:37 GMT
దుబ్బాక ఎమ్మెల్యే , టీఆర్ఎస్ సీనియర్ నేత రామలింగారెడ్డి హఠాన్మరణం గులాబీ పార్టీలో విషాదం నింపింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రామలింగారెడ్డి మరణానికి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఇక తాజాగా రామలింగారెడ్డికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రతిపాదన చేశారు. రామలింగారెడ్డి మృతితో వచ్చే ఉప ఎన్నికల్లో ఆయన భార్యకే టికెట్ ఇవ్వాలని.. అలా టీఆర్ఎస్ ఇస్తేనే ఆయనకు నివాళి అర్పించినట్టు అన్నారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీపెట్టకుండా ఏకగ్రీవానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

ఇక దామోదర, గీతారెడ్డితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని.. అవసరం అయితే హరీష్ రావుతో సమన్వయం చేసి నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది రామలింగారెడ్డి అని.. ఆయనకు ఇదే మా నివాళి అని అన్నారు.
Tags:    

Similar News