అమెరికాలో భారతీయ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ కి 41 ఏళ్ల జైలు శిక్ష .. ఏంచేశాడంటే?

Update: 2021-02-20 17:30 GMT
అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టు భారత సంతతి కి చెందిన ఓ వ్యక్తికి  41 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 41 ఏళ్లు జైలు శిక్ష విధించడానికి గల కారణం ఏంటి అంటే ..  మోసపూరితంగా తప్పుడు బ్రాండ్లతో మందులు విక్రయించిన కేసులో 41 నెలల జైలు శిక్ష విధించింది. సతీష్ పటేల్   అనే భారత సంతతి వ్యక్తికి టెక్సాస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ పరేక్ షా.. మిస్ ‌బ్రాండింగ్ సప్లిమెంట్లు అమ్మినందుకు 41 నెలల శిక్షను విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఎస్‌ కే లాబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ ‌గా ఉన్న సతీష్ మరికొందరితో కలిసి ఇలా మోసపూరితంగా తప్పుడు బ్రాండ్స్‌ తో వర్కౌట్, వెయిట్ లాస్ సప్లిమెంట్లను కస్టమర్లకు అమ్మాడు. జాక్ 3డీ, ఆక్సీఏలైట్ ప్రొ బ్రాండ్స్ పేరిట వీటిని విక్రయించాడు. వీటిని ఉపయోగించిన తర్వాత అనారోగ్య సమస్యలకు గురైన కస్టమర్లు సతీష్ ‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ .. ఆక్సీఏలైట్ ప్రొ అనే మందును వినియోగించిన కస్టమర్ల కాలేయం దెబ్బతిన్నట్లు గుర్తించింది. దాంతో సతీష్ విక్రయిస్తున్న జాక్3డీ, ఆక్సీఏలైట్ ప్రొ బ్రాండ్స్ ‌ను నిషేధించింది. తాజాగా ఈ కేసు టెక్సాస్ ఫెడరల్ కోర్టులో విచారణకు వచ్చింది.   ఈ కేసులో భాగంగా సతీష్‌ పటేల్‌ను దోషిగా తేల్చింది. మోసపూరిత ఔషధాలను విక్రయించిన సతీష్‌కు 41 నెలల జైలు శిక్ష విధించింది.
Tags:    

Similar News