షాకింగ్: ఈసారీ ఇండియన్ ఇంటి మీదే దాడి

Update: 2017-02-27 05:52 GMT
అమెరికాలో జాతి విద్వేషం అంతకంతకూ పెరుగుతోందా? అమెరికన్లు అందరిలో కాకున్నా.. కొందరిలో మోతాదు మించిన జాత్యాహంకారం అంతకంతకూ పెరగటమే కాదు.. వెర్రి తలలు వేస్తుందన్న విషయం మీద సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. తెలుగోడు కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య భారీ కలకలమే రేపింది. ఈ షాకింగ్ ఘటన నుంచి కోలుకోకముందే.. ఊహించని రీతిలో మరో అనూహ్య పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. ఈసారి వ్యక్తిగతంగా దాడి కాకుండా.. ఏకంగా ఇండియన్ ఇంటి మీద దాడి జరిగిన తీరు షాకింగ్ గా మారింది.

దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ ఘటన భారతీయుల ఆందోళనల్ని మరింత పెంచుతుందనటంలో సందేహం లేదు. పీటన్ సిటీలోని ఒక ఇంటి మీదకు గుర్తు తెలియని కొందరువ్యక్తులు దాడి చేయటమే కాదు.. యాభైకి పైగా పోస్టర్లు అతికించారు. గోధుమ వర్ణం వాళ్లు.. ఇండియన్లు ఇక్కడ ఉండొద్దన్న అర్థం వచ్చేలా ఇంటి మీద నినాదాలురాసేసిన వారు.. తలుపులు.. కిటికీల మీద కరపత్రాల్ని అతికించేశారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. గోడల మీద కోడిగుడ్లను విసిరటంతో పాటు..కుక్కల మలమూత్రాల్ని పూసేయటం సంచలనంగా మారింది.
Read more!

అయితే.. ఏ ఇంటి మీద దాడి జరిగిందో.. ఆ భారతీయుడు బయటకు రావటానికి.. తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ఎవరో ఒకరు చేశారని.. అందరిని దూషించటం తప్పు అవుతుందని.. ఎవరో అలాంటి పని చేసినా.. మిగిలిన అమెరికన్లు తన ఇంటికి రావటమేకాదు.. ఇంటిని శుభ్రం చేయటంలో సాయం చేసినట్లుగా సదరు వ్యక్తి చెప్పినట్లుగా తెలుస్తోంది.

తన వివరాలు బయటకు వస్తే.. మళ్లీ తన మీద దాడి జరుగుతుందన్న భయాందోళనల్ని సదరు వ్యక్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ బీఐ విచారణ జరుపుతోంది. ఇంటి మీద దాడి అంటే.. ఒకరిద్దరూ ఇలాంటి పని చేయలేరని.. పెద్ద గుంపే ఇందులో పాల్గొని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది. ఈ ఉదంతానికి సంబంధించి మరో సమాచారం ఏమిటంటే.. శ్రీనివాస్ కూఛిబొట్లపై కాల్పులు జరగటానికి ముందే ఈ ఉదంతం జరిగినట్లుగా కొందరు చెబుతున్నారు. కానీ.. ఆ విషయం బయటకు రాలేదేని.. తాజా పరిణామాలతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News