టీకా తీసుకున్నా పాజిటివ్ .. ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన !

Update: 2021-04-22 04:39 GMT
దేశంలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. సెకండ్‌ వేవ్ ‌లో  ఉధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆసుపత్రులలో  మందులు, బెడ్లు దొరకక, వెంటిలేటర‍్ల కొరతతో కరోనా రోగులు అల్లాడిపోతున్నారు.  చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కరోనా‌ టీకా తీసుకున్న తరువాత  చోటు చేసుకుంటున్న ఘటనలతో భయాందోళలను నెలకొన్నాయి.దీనితో కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో  ఐసిఎంఆర్ సంచలన డేటాను విడుదల చేసింది.  టీకాలు వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ,  వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్‌ డేటా తేల్చంది.

అయితే , కరోనా ‌ టీకా తీసుకున్న తరువాత వైరస్‌ సోకుతున్న వారి నిష్పత్తి  సామాన్య ప్రజలలో చాలా తక్కువగా ఉందని ఈ డేటా  తెలిపింది. టీకా  మొదటి లేదా రెండవ మోతాదు తీసుకున్న చాలా రోజుల తరువాత కరోనా బారిన పడిన వ్యక్తుల డేటాను ఐసిఎంఆర్‌ నిపుణుల  బృందం వెల్లడించింది. ఆ డేటా ప్రకారం...దేశంలో ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి భారత్ బయోటెక్ కోవాక్సిన్ అందించారు. కోవాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న వారిలో దాదాపు 0.04 శాతం మంది కరోనా పాజిటివ్  నిర్ధారణ అయిందని,  93 లక్షల మంది తమ మొదటి మోతాదును, సుమారు 17 లక్షల మంది రెండవ మోతాదును పొందారు. మొదటి మోతాదు పొందిన 93 లక్షలమందిలో  4,208 మందికి, రెండవ షాట్ తీసుకున్న 17 లక్షలలో, 695 మంది మాత్రమే కరోనా సోకింది అని తెలిపారు.

సీరం ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్  రెండవ మోతాదు తీసుకున్న తరువాత పాజిటివ్ పరీక్షించిన వారి శాతం 0.03 శాతంగా ఉంది. దాదాపు 10 కోట్ల మంది కోవిషిల్డ్‌ మొదటి మోతాదును  స్వీకరించగా  వీరిలో 17,145 మంది తొలి డోసు  తర్వాత  1.5 కోట్లకు పైగా ప్రజలకు రెండవ మోతాదు ను తీసుకోగా, వీరిలో, 5,014 మంది పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల నిష్పత్తి మొదటి మోతాదు తర్వాత 0.02 శాతం, రెండవ మోతాదు తర్వాత 0.03 శాతంగా ఉంది. అలాగే  కరోనా టీకా తీసుకున్న తరువాత  ప్రతి 10,000 జనాభాకు 2-4 మందికి మాత్రమే కోవిడ్-19  సోకుతోందనీ నీతి ఆయోగ్  సభ్యుడు  డాక్టర్ వి.కె పాల్ అన్నారు. రెండవ మోతాదు తీసుకున్న 10-15 రోజుల తరువాత మాత్రమే తగినంత యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని నిపుణులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 87 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 79 శాతం మంది ఫ్రంట్ లైన్ కార్మికులు తమ మొదటి మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్లను  స్వీకరించారని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు అనారోగ్యానికి గురి కావడం చాలా తక్కువగా జరుగుతుంది అని , అలాగే వారికీ గతంలో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వ్యాక్సిన్ కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది తప్ప వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దు అని , వ్యాక్సిన్  తీసుకోవాలని తెలిపారు.
Tags:    

Similar News