పెళ్లాన్ని పేకాటలో తాకట్టు పెట్టిన భర్త ..తర్వాత ఏమైందంటే ?

Update: 2020-07-02 08:50 GMT
రోజు రోజుకి ఈ సమాజం లో బంధాలకి , అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది. తాగుడు , పేకాటకి పూర్తి గా భానిసై పోయిన ఓ ప్రబుద్దుడు పేకాట లో భార్యని తాకట్టు పెట్టాడు. బెట్టింగ్ లో ఓడితే రేప్ చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చాడు. అయితే , ఆ  బెట్టింగ్ ‌లో ఆ ప్రబుద్దుడు  ఓడటంతో.. తన స్నేహితులకు భార్యను అప్పగించాడు. దీంతో వారు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. తన భర్త మద్యానికి బానిసై డబ్బు లేకపోవడంతో ఈ దారుణానికి ఒడిగొట్టినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటన పై పూర్తి  వివరాలు చూస్తే ... ఉత్తర ప్రదేశ్ లోని జాన్‌ పూర్‌ ఈ సంఘటన జరిగింది. పేకాటలో ఓడి పోయిన సుశీల్ తన భార్యను స్నేహితులకు అప్పగించాడు. వారు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. భర్తే ఇలా చేయడం తో ఆమె బాధ తో మేన మామ ఇంటి కెళ్లింది. తన వెనకే వచ్చిన భర్త మన్నించమని వేడుకోవడంతో మనసు మార్చుకొని తిరిగి వచ్చింది. మార్గమధ్యంలో కారును నిలిపివేసిన నిందితుడు తన స్నేహితులను మరోసారి ఆమెపై లైంగిక దాడి చేయమని ప్రోత్సహించాడు.

దీంతో తాగుడుకు బానిసైన తన భర్త జూదం కోసం డబ్బులు లేకపోవడంతో తనను పందెంగా పెట్టాడని బాధితురాలు వాపోయింది. భర్త స్నేహితుడైన అరుణ్, అతడి బంధువు అనిల్ తరచుగా తమ ఇంటికొచ్చి మందు తాగుతూ పేకాట ఆడతారని , ఒక రోజు తన భర్త పందెం కాశాడని.. ఓడటంతో.. అరుణ్, అనిల్ కలిసి తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News