హైదరాబాద్ లో ఇళ్లు కొనట్లేదు..!
ఆర్థిక మందగమనం ప్రభావం మెల్లిమెల్లిగా జడలు విప్పుతోంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ పరిణామం దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై భారీగా పడుతోంది. హైదరాబాద్ లో గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం స్థిరాస్తి వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ లో గృహ విక్రయాలు ఏకంగా 32శాతం తగ్గడం కలవరపరుస్తోంది. కేవలం 3280 గృహాలు మాత్రమే అమ్ముడుపోయాయి. పోయిన సంవత్సరంతో పోల్చిచూస్తే 32 శాతం తగ్గడం అంటే అది భారీ షాక్ గానే మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక దేశవ్యాప్తంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్ తోపాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 18శాతం తగ్గాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. ఏడు నగరాల్లో గత ఏడాది 67140 ఇళ్లు అమ్ముడు పోగా.. ఈ ఏడాది 55080 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 18శాతం అమ్మకాలు పడిపోయాయి.
ఇక అత్యధికంగా దేశంలో ఐటీ సిటీగా పేరు పొందిన బెంగళూరులో గతేడాదితో పోల్చితే ఏకంగా 35శాతం అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్ లో 32శాతం, కోల్ కతాలో 27శాతం పడిపోయాయి.. దీన్ని బట్టి ఐటీ సిటీలైన బెంగళూరు, హైదరాబాద్ ల్లో టెకీలు ఈ ఆర్థిక మందగమనంలో ఇళ్లు కొనడానికి ముందుకు రావడం లేదని.. ఇతర వ్యాపార, ప్రజలు కూడా సాహసించడం లేదని అర్థమవుతోంది.
ప్రధానంగా ఇళ్ల కొనుగోలు పడిపోయవడానికి ఆర్థిక మందగమనంతోపాటు సబ్ వెన్షన్ స్కీమ్ రద్దు - మార్కెట్ సెంటిమెంట్ - వడ్డీ రాయితీ పథకాన్ని నిషేధించడం.. ముహూర్తాలు లేకపోవడం కూడా విక్రయాలు పడిపోవడానికి కారణంగా మార్కెుట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలు రాబోయే రోజుల్లో ఈ రియల్ ఎస్టేట్ రంగంపై ఏమేరకు ప్రభావం చూపుతాయనేది వేచిచూడాల్సిందే.
ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ లో గృహ విక్రయాలు ఏకంగా 32శాతం తగ్గడం కలవరపరుస్తోంది. కేవలం 3280 గృహాలు మాత్రమే అమ్ముడుపోయాయి. పోయిన సంవత్సరంతో పోల్చిచూస్తే 32 శాతం తగ్గడం అంటే అది భారీ షాక్ గానే మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక దేశవ్యాప్తంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్ తోపాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 18శాతం తగ్గాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. ఏడు నగరాల్లో గత ఏడాది 67140 ఇళ్లు అమ్ముడు పోగా.. ఈ ఏడాది 55080 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 18శాతం అమ్మకాలు పడిపోయాయి.
ఇక అత్యధికంగా దేశంలో ఐటీ సిటీగా పేరు పొందిన బెంగళూరులో గతేడాదితో పోల్చితే ఏకంగా 35శాతం అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్ లో 32శాతం, కోల్ కతాలో 27శాతం పడిపోయాయి.. దీన్ని బట్టి ఐటీ సిటీలైన బెంగళూరు, హైదరాబాద్ ల్లో టెకీలు ఈ ఆర్థిక మందగమనంలో ఇళ్లు కొనడానికి ముందుకు రావడం లేదని.. ఇతర వ్యాపార, ప్రజలు కూడా సాహసించడం లేదని అర్థమవుతోంది.
ప్రధానంగా ఇళ్ల కొనుగోలు పడిపోయవడానికి ఆర్థిక మందగమనంతోపాటు సబ్ వెన్షన్ స్కీమ్ రద్దు - మార్కెట్ సెంటిమెంట్ - వడ్డీ రాయితీ పథకాన్ని నిషేధించడం.. ముహూర్తాలు లేకపోవడం కూడా విక్రయాలు పడిపోవడానికి కారణంగా మార్కెుట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలు రాబోయే రోజుల్లో ఈ రియల్ ఎస్టేట్ రంగంపై ఏమేరకు ప్రభావం చూపుతాయనేది వేచిచూడాల్సిందే.