ఎందుకు?; హారీశ్‌ రావు వరంగల్‌ కోర్టుకు వచ్చారు

Update: 2015-06-30 08:26 GMT
తెలంగాణరాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తాజాగా వరంగల్‌ కోర్టుకు హాజరయ్యారు. దీంతో.. కోర్టు వద్ద భారీగా సందడి నెలకొంది. ఇంతకీ హరీశ్‌రావుకు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుతం హరీశ్‌ మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయనపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు వరంగల్‌లో నడుస్తోంది. దీంతో.. ఈ కేసు విచారణ కోసం ఆయన కోర్టుకు వచ్చారు. పరకాల ఉప ఎన్నిక సందర్భంగా.. ప్రచారానికి వచ్చిన హరీశ్‌..ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై నమోదైన కేసుకు హరీశ్‌ తాజాగా హాజరయ్యారు. హరీశ్‌ రాకతో.. స్థానిక రాజకీయ నేతలు పెద్దఎత్తున తరలిరావటంతో కోర్టు వద్ద సందడి నెలకొంది.

Tags:    

Similar News