వైసీపీ నేతల వేధింపులు.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా!

Update: 2021-09-03 13:55 GMT
ఏపీలో మరో కలకలం చెలరేగింది. ఏపీ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనమైంది. ఇటీవల విశాఖ ఏజెన్సీలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఏకంగా 74మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి కలకలం రేపారు.

చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఈవో, వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ 74మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అధికార పార్టీ నేతల వేధింపులకు నిరసనగా పాకాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈవో కుసుమకుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

వైసీపీ నేతల వేధింపులు ఆపాలని .. నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల విశాఖ మన్యంలోని 32మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు, రవాణా సదుపాయాలు లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు వేధిస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే వాలంటీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. గత్యంతరం లేక రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు.




Tags:    

Similar News