మనవడిని దారుణంగా హత్య చేసిన అమ్మమ్మ.. కారణం ఏంటంటే ?

Update: 2021-07-30 12:32 GMT
సంగారెడ్డిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన  సొంత మనవడిని అమ్మమ్మ అతి కిరాతకంగా చంపేసింది. మరో వ్యక్తితో కలిసి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్త చనిపోయిన కుమార్తె రెండో పెళ్లికి అడ్డొస్తున్నాడని ఆమె బాలుడిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో ఆమె చెప్పింది. గురువారం సంగారెడ్డిలో రెండేళ్ల బాలుడు యశ్వంత్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంత వెతుకులాడినా ఆచూకి లభించలేదు. అయితే శుక్రవారం బొబ్బిలకుంట చెరువులో యశ్వంత్‌ మృతదేహం కనిపించింది.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. యశ్వంత్‌ ను హత్య చేసి చెరువులో పడేసినట్లు చెప్పారు. కాగా బాలుడి తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో కుమార్తె రెండో పెళ్లి చేయాలని భావించిన సదరు మహిళ, అందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.  

దీంతో పిర్యాధు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..యశ్వంత్ అమ్మమ్మ చెబుతున్నదాని ప్రకారం ఆమెనే అనుమానించారు. చెరువుకు ఎవరితో వెళ్లాడనే దానిపై ఆరా తీయడంతో అసలు విషయం. దీంతో ఆ అమ్మమ్మ నిజం ఒప్పుకుంది. యశ్వంత్ తండ్రి రెండు సంవత్సరాల క్రితం చనిపోవడంతో తన కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణాయించానని, కాని కొడుకు ఉండడం వల్ల సంబంధాలకు అడ్డుగా మారాడని భావించింది. నేపథ్యంలోనే యశ్వంత్‌ ను తుదముట్టించి కూతురుకు మంచి భవిష్యత్ ఇవ్వాలని భావించినట్టు తెలిపింది. ఈనేపథ్యంలోనే బాలున్ని చంపి అనంతరం ఎవరికి తెలియకుండా చెరువులో పడేసినట్టు అంగీకరించింది.
Tags:    

Similar News