మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి మృతి!

Update: 2020-09-05 05:15 GMT
మాజీ  ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజుల నుండి ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్‌ అనుచరుడుగా జగదీశ్వర్‌ రెడ్డి కి మంచి గుర్తింపు ఉంది.   ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జగదీశ్వర్‌ రెడ్డి కొంతకాలం టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.

గదీశ్వర్‌రెడ్డికి భార్యా , నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన మృతికి అన్ని పార్టీల నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జగదీశ్వర్‌ రెడ్డి మృతిపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్ ‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జగదీశ్వర్‌రెడ్డి మృతి తమకు తీరనిలోటని కాంగ్రెస్‌ జిల్లా ప్రచార కార్యదర్శి బెనహర్‌ అన్నారు.  జగదీశ్వర్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News