హైదరాబాద్‌ లో మళ్లీ భూ ప్రకంపనలు... ఈసారి వనస్థలిపురం, బీఎన్‌‌రెడ్డి నగర్‌ లో !

Update: 2020-10-22 07:30 GMT
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో చికురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ వాసులను భూప్రకంపనలు మరింత ఆందోళనకి గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. హైదరాబాద్ నగరంలోని ఎల్‌ బీ నగర్ శివారు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూ ప్రకంపనలు ప్రజలని బెంబేలెత్తించాయి. ఈ రోజు తెల్లవారు జామున .. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, వైదేహి నగర్‌ లో గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి.

ఒక్క సెకండ్‌ పాటు భూమి కంపించి శబ్దాలు రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పలుమార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు ఇలా పలు పర్యాయాలు స్వల్ప భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇకపోతే , మొన్న ఆ మధ్య   జూబ్లీహిల్స్ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు పలుమార్లు భూమి కంపించగా, ఆ తర్వాత గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు భయపెట్టాయి. అంతేకాకుండా, భూమిలోంచి శబ్దాలు కూడా రావడంతో ప్రజలు వణికిపోయారు.
Tags:    

Similar News