దేశంలో పెరుగుతున్న కరోనా.. మరో వేవ్ వస్తుందా?
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్పస్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుల పెరుగుదలతో పాటు క్రియాశీల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనాతో చైనాలాంటి దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తాజాగా హెల్త్ డైరెక్టర్ కూడా ప్రకటించారు.
ఇప్పటికే దేశంలో మెజార్టీ ప్రజలు డబుల్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొందరైతే మూడో బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు.టీకా పనిచేస్తుందా? పరిస్థితులు ఎలా మారోబోతున్నాయని త్వరలోనే తేలనుంది. ఎందుకంటే టీకా తీసుకున్నదేశాల్లోనూ 4వ వేవ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
భారతదేశంలో గత కొన్ని రోజులుగా రోజుకు 2వేలకు పైగా కొత్త కోవిడ్ 19 కేసులు ,నమోదయ్యాయి. ఇక కోవిడ్ తో మరణాల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో 2000 కంటే ఎక్కువ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను నమోదు చేయడం వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. శనివారం నాటి సంఖ్యతో పోలిస్తే.. దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 15079కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 0.04 శాతానికి పెరిగినట్లుగా తెలుస్తోంది.
రోజువారీ సానుకూలత రేటు 0.56 శాతంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,17,724కు చేరుకుంది. శుక్రవారం 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న నమోదైన 33 కరోనా మరణాలు కేరళలో నమోదైన మృతుల సంఖ్య 31 కాగా.. మరో రెండు మరణాలు ఢిల్లీలో చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.22 లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక కేసుల కంటే రికవరీలే తక్కువగా నమోదవడం ప్రధానంగా కనిపిస్తోంది. రికవరీ రేటు దేశంలో 98.75 శాతానికి చేరుకోవడం ఉపశమనంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీలో నిన్న 1042 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10 తర్వాత అత్యధికంగా 4.64 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.
కరోనా వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై స్పష్టత లేదు. దీని నివారణ పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం.. జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని వైద్యులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే దేశంలో మెజార్టీ ప్రజలు డబుల్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొందరైతే మూడో బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు.టీకా పనిచేస్తుందా? పరిస్థితులు ఎలా మారోబోతున్నాయని త్వరలోనే తేలనుంది. ఎందుకంటే టీకా తీసుకున్నదేశాల్లోనూ 4వ వేవ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
భారతదేశంలో గత కొన్ని రోజులుగా రోజుకు 2వేలకు పైగా కొత్త కోవిడ్ 19 కేసులు ,నమోదయ్యాయి. ఇక కోవిడ్ తో మరణాల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో 2000 కంటే ఎక్కువ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను నమోదు చేయడం వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. శనివారం నాటి సంఖ్యతో పోలిస్తే.. దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 15079కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 0.04 శాతానికి పెరిగినట్లుగా తెలుస్తోంది.
రోజువారీ సానుకూలత రేటు 0.56 శాతంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,17,724కు చేరుకుంది. శుక్రవారం 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న నమోదైన 33 కరోనా మరణాలు కేరళలో నమోదైన మృతుల సంఖ్య 31 కాగా.. మరో రెండు మరణాలు ఢిల్లీలో చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.22 లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక కేసుల కంటే రికవరీలే తక్కువగా నమోదవడం ప్రధానంగా కనిపిస్తోంది. రికవరీ రేటు దేశంలో 98.75 శాతానికి చేరుకోవడం ఉపశమనంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీలో నిన్న 1042 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10 తర్వాత అత్యధికంగా 4.64 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.
కరోనా వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై స్పష్టత లేదు. దీని నివారణ పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం.. జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని వైద్యులు అంచనా వేస్తున్నారు.