ఐఏఎస్ ల ఆందోళన వెనుక కొత్త కోణం
తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కొత్త ఆపరేషన్ మొదలుపెట్టిందా? ఈ క్రమంలోనే ఐఏఎస్ లో తిరుగుబాటు జరుగుతోందా? అంటే పలువర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలోని స్థానిక ఐఏఎస్ లు అసంతృప్తితో ఉన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల వెనుక మాజీ ఐఏఎస్ అధికారి - ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడు - ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు - ఆయన శిష్యుడైన ఓ ఐఏఎస్ ఉన్నట్లు టీఆర్ ఎస్ వర్గాలు ప్రచారంలో పెడుతున్నాయి. ఓ ఐఏఎస్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
స్థానిక ఐఏఎస్ లు అసంతృప్తితో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనివెనుక కొప్పుల రాజు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజు మంత్రాంగంలో భాగంగా ఓ ఐఏఎస్ అధికారి ఈ కార్యాచరణ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని మేఘాలయభవన్ లో అనేకసార్లు సమావేశమైనట్టు ప్రభుత్వానికి చాలాకాలం కిందటే సమాచారం అందింది. త్వరలో ఆయన వీఆర్ ఎస్ తీసుకుని - ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడమా? లేక ముందే ప్రభుత్వాన్ని విమర్శించి - వీఆర్ ఎస్ తీసుకోవడమా! అన్న అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రాజు ప్రోత్సహిస్తున్నారని - వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇదంతా చేస్తున్నట్టు విశ్లేషించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక విలేకరుల సమావేశానికి సదరు ఐఏఎస్ హాజరయ్యారని - ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడి - తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి - ప్రభుత్వం చేత సస్పెండ్ చేయించుకోవాలన్నదే ఆయన కుట్ర అని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అయితే, తెలంగాణలో తమకు గౌరవం దక్కడంలేదని - వివక్ష ఉందని...ఓ వర్గానికి చెందిన వారికే పదోన్నతులు దక్కుతున్నాయనే ఐఏఎస్ ల ఆవేదనలో కూడా నిజం లేకపోలేదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమకు పదోన్నతులు - ముఖ్యమైన పోస్టింగ్ ల విషయంలో ఉద్దేశపూర్వక నిరాదరణ ఎదురవుతుందనే వారి ఆవేదనలో నిజం ఉందంటున్నారు. అందుకే వారు ఒక్కతాటిపైకి వచ్చిన నిరసన తెలుపుతున్నారని అంటున్నారు. సర్కారుకు సారథ్యం వహించిన పార్టీ విమర్శలు గుప్పించే బదులుగా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.
స్థానిక ఐఏఎస్ లు అసంతృప్తితో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనివెనుక కొప్పుల రాజు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజు మంత్రాంగంలో భాగంగా ఓ ఐఏఎస్ అధికారి ఈ కార్యాచరణ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని మేఘాలయభవన్ లో అనేకసార్లు సమావేశమైనట్టు ప్రభుత్వానికి చాలాకాలం కిందటే సమాచారం అందింది. త్వరలో ఆయన వీఆర్ ఎస్ తీసుకుని - ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడమా? లేక ముందే ప్రభుత్వాన్ని విమర్శించి - వీఆర్ ఎస్ తీసుకోవడమా! అన్న అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రాజు ప్రోత్సహిస్తున్నారని - వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇదంతా చేస్తున్నట్టు విశ్లేషించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక విలేకరుల సమావేశానికి సదరు ఐఏఎస్ హాజరయ్యారని - ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడి - తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి - ప్రభుత్వం చేత సస్పెండ్ చేయించుకోవాలన్నదే ఆయన కుట్ర అని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అయితే, తెలంగాణలో తమకు గౌరవం దక్కడంలేదని - వివక్ష ఉందని...ఓ వర్గానికి చెందిన వారికే పదోన్నతులు దక్కుతున్నాయనే ఐఏఎస్ ల ఆవేదనలో కూడా నిజం లేకపోలేదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమకు పదోన్నతులు - ముఖ్యమైన పోస్టింగ్ ల విషయంలో ఉద్దేశపూర్వక నిరాదరణ ఎదురవుతుందనే వారి ఆవేదనలో నిజం ఉందంటున్నారు. అందుకే వారు ఒక్కతాటిపైకి వచ్చిన నిరసన తెలుపుతున్నారని అంటున్నారు. సర్కారుకు సారథ్యం వహించిన పార్టీ విమర్శలు గుప్పించే బదులుగా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.