మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్ననే.. ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్న జమ్మికుంట మునిసిపల్ వైఎస్ చైర్ పర్సన్ దేశినేని స్వప్న, ఆమె భర్త, ఇల్లందకుంట రామాలయ మాజీ చైర్మన్ కోటి తిరిగి గులాబీ గూటికి చేరారు. బీజేపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని ఆ దంపతులు ప్రకటించారు. తాజాగా.. మరో సమస్య వచ్చిపడింది.
ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డి దళితులను దూషించారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ.. టీఎస్జీసీసీ చైర్మన్ ధారావత్ మోహన్ గాంధీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈటల ఫౌల్ట్రీ వ్యాపార భాగస్వామి కూడా అయిన మధుసూదన్ రెడ్డి.. వాట్సాప్ చాట్ లో దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని మోహన్ గాంధీ ఆరోపించారు.
ఓటమి భయంతోనే.. దళిత బంధు పథకాన్ని విమర్శిస్తున్నారని ఆయన మోహన్ గాంధీ ఆరోపించారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మధుసూదన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా.. ఆయన వ్యాఖ్యలపట్ల ఈటల రాజేందర్ కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకపోతే.. దళిత వాడల్లో ఓట్లు అడగడానికి రానివ్వబోమని అన్నారు.
ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డి దళితులను దూషించారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ.. టీఎస్జీసీసీ చైర్మన్ ధారావత్ మోహన్ గాంధీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈటల ఫౌల్ట్రీ వ్యాపార భాగస్వామి కూడా అయిన మధుసూదన్ రెడ్డి.. వాట్సాప్ చాట్ లో దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని మోహన్ గాంధీ ఆరోపించారు.
ఓటమి భయంతోనే.. దళిత బంధు పథకాన్ని విమర్శిస్తున్నారని ఆయన మోహన్ గాంధీ ఆరోపించారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మధుసూదన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా.. ఆయన వ్యాఖ్యలపట్ల ఈటల రాజేందర్ కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకపోతే.. దళిత వాడల్లో ఓట్లు అడగడానికి రానివ్వబోమని అన్నారు.