పవన్‌ కోసం రంగంలోకి కామెడీ గ్యాంగ్‌

Update: 2019-03-26 07:48 GMT
సినిమా ఇండస్ట్రీలో పవన్‌ కళ్యాణ్‌ కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువ హీరోల నుండి కమెడియన్స్‌ వరకు ఎంతో మంది పవన్‌ కు అభిమానులం అంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో మంది పవన్‌ ను ఆదర్శంగా తీసుకుని జీవిస్తున్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి పవన్‌ రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆయన తరపున ప్రచారం చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ముఖ్యంగా జబర్దస్త్‌ ఫేం, కమెడియన్‌ హైపర్‌ ఆది జనసేన తరపున ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నాడు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పోటీ చేసిన తెనాలి నియోజక వర్గంలో హైపర్‌ ఆది ప్రచారం చేశాడు. గ్లాస్‌ గుర్తుకు ఓటు వేసి జనసేనను గెలిపించి పవన్‌ కళ్యాణ్‌ ను సీఎం చేయాలని ఆయన కోరాడు. ఇతర పార్టీలు రూ. 500 ఇస్తేనో లేదంటే బిర్యానీ పెడితేనో జనాలు వస్తారు. కాని పవన్‌ కళ్యాణ్‌ కోసం మాత్రం స్వచ్చందంగా జనాలు వస్తారని ఆది అన్నాడు. తనదైన శైలిలో స్పీచ్‌ ఇస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రైతులకు పెన్షన్‌ ఇస్తానంటూ ప్రకటించిన ఏకైక నాయకుడు పవన్‌ అంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఈ ఎన్నికల్లో పవన్‌ గెలుపు తద్యం అని, తప్పకుండా పవన్‌ గెలుస్తాడనే నమ్మకంను ఆది వ్యక్తం చేశాడు.

ఇక గబ్బర్‌ సింగ్‌ కమెడియన్స్‌ బ్యాచ్‌ అంతా కూడా పవన్‌ ను కలిసి తమ మద్దతును పలికారు. ఈ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసేందుకు తాము ఉన్నాము అంటూ ముందుకు వచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ తరపున ప్రచారం చేస్తామని వారు అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేల జనసేన కోసం కమెడియన్స్‌ రంగంలోకి దిగడం ఇండస్ట్రీ వర్గాల వారిని మరియు జనాలను ఆకర్షిస్తోంది. మరి వీరు చేసిన ప్రచారం పవన్‌ జనసేనకు ఏమైన ఫలితాన్ని ఇచ్చేనో చూడాలి.
Tags:    

Similar News