తొమ్మిదో క్లాస్ అమ్మాయి ప్రసవం వెనుక..?

Update: 2015-12-01 09:03 GMT
హైదరాబాద్ మహానగరంలో అందునా మాదాపూర్ లాంటి ప్రాంతాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని గర్భం దాల్చటం.. స్కూల్ మరుగుదొడ్లో ప్రసవం కావటం తెలిసిందే. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. స్కూ్లో దాదాపు 13 మంది మహిళా టీచర్లు ఉన్నప్పటికీ.. విద్యార్థిని శారీరకంగా వచ్చే మార్పుల్ని ఎవరూ గుర్తించకపోవటం.. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తొమ్మిదో తరగతి విద్యార్థిని గర్భం వెనుక కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది.

ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు ఈ కేసు వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. పలువురిని విచారించారు. తాజాగా పోలీసు వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. తొమ్మిది తరగతి విద్యార్థిని దుస్థితికి ఆమె అక్కే కారణంగా భావిస్తున్నారు. చెడు సావాసాలు మరిగిన ఆమె.. చెల్లెల్ని రొంపిలోకి దించిందని గుర్తించారు. ధనుష్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఈ విద్యార్థినిని అత్యాచారం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.

విద్యార్థిని పరిస్థితికి కారణమైన వారిపై పోలీసులు కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. బాధ్యతల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూలు హెడ్మాష్టర్ ను సస్పెండ్ చేయగా.. టీచర్లకు మెమో జారీ చేశారు.
Tags:    

Similar News