కులాల కుంప‌ట్ల‌ను రాజేస్తున్నారు.. చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-01-03 10:35 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కులాల మ‌ధ్య చిచ్చు పెట్టొద్ద‌ని ఆయ‌న సూచించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద కూడా కులాల కుంపటి రాజుకోవటానికి ప్రభుత్వ పెద్దల వైఖరే కారణమని చంద్రబాబు ఆక్షేపించారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో అంబేడ్కర్ విగ్రహా ఏర్పాటు సందర్భంగా జరిగిన ఘటనను ఖండిస్తున్నానన్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం పక్కనే వివాదం సృష్టించేలా మరో విగ్రహం పెడతామనటం సరికాదన్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కోసం ఓ వర్గం ర్యాలీ చేసి కావాలనే ఉద్రిక్తతలు సృష్టించారని చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంతం నెగ్గించుకోవటం చేసే ఈ చర్యను విరమించుకోవాలని హితవు పలికారు. దళిత సంఘాలు రోడ్డెక్కే వరకు అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా..పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.

కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదన్న చంద్రబాబు.., దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"రామకుప్పంలో విగ్రహ ఏర్పాటుకు ఉద్రిక్తతలు సృష్టించారు. అంబేడ్కర్ విగ్రహం వద్దే ఉయ్యాలవాడ విగ్రహం వద్దు. ఉయ్యాలవాడ విగ్రహం మరో చోట ఏర్పాటు చేయాలి. ఎస్సీ సంఘాలు ధర్నా చేసేవరకు అధికారులు ఏం చేస్తున్నారు ?. ఫిర్యాదును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు ?. కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచివి కాదు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు ఆపాలి.`` అని చంద్ర‌బాబు హిత‌వు ప‌లికారు.

చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలోని శివాజీనగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని వివాదాస్పద స్థలంలో దళిత సంఘాలు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఇవాళ అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుకు రెడ్డి సామాజిక వర్గీయులు పూనుకున్నారు. సమచారం అందుకున్న దళితుల సంఘాల నేతలు.. ఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News