బాబు సతీమణికి చేతికి ఫ్రాక్చర్‌

Update: 2015-05-25 07:22 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేతికి ఫ్రాక్చర్‌ అయ్యింది. సోమవారం ఉదయం ఆమె వ్యాయామం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.

వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందకు జారి పడిన ఆమె.. చేతి మణికట్టుకు ఫ్రాక్చర్‌ అయ్యిందని చెబుతున్నారు. గాయపడిన వెంటనే ఆమెను.. జూబ్లీహిల్స్‌లోని అపోలోకు తరలించినట్లు చెబుతున్నారు. కుడి చేతికి దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆమె కుమారుడు లోకేశ్‌.. వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అపోలో లోని థర్డ్‌ఫ్లోర్‌లోని ఇంటర్నేషనల్‌ వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు.

బాలకృష్ణ సతీమణి వసుంధర.. బాబు కోడలు.. లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి ఆసుపత్రికి చేరుకున్నారు. గాయం కారణంగా పెద్ద ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పి.. కొంత విశ్రాంతి అవసరమని చెప్పారు. కాసేపు ఆసుపత్రిలో ఉన్న చంద్రబాబు.. అనంతరం వెళ్లిపోయారు.


Tags:    

Similar News