భావోద్వేగంగా మాట్లాడటం పెద్దగా రాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా అందుకు భిన్నంగా మాట్లాడారు. జూన్ రెండో తేదీన ఏపీ నవ నిర్మాణదీక్షలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చిన ఆయన.. ఏపీ విభజన సందర్భంగా జరిగిన మోసాన్ని.. అన్యాయాన్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు.
విభజన హేతుబద్ధంగా జరగలేదని ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు వ్యాఖ్యానించినప్పటికీ.. ఇంత భావోద్వేగంతో మాట్లాడింది మాత్రం ఇదే తొలిసారి. విభజన సందర్భంగా రాజధాని లేకుండా చేశారని.. కట్టుబట్టలతో బయటకు పంపారంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 2న నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. టీచర్లు ఒక అరగంట సేపు దీక్ష చేయాలని పిలుపునిచ్చారు.
విభజన సందర్భంగా చాలా అన్యాయంగా.. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. పార్లమెంటులో అరగంట వ్యవధిలో విభజన బిల్లును ఆమోదింపచేశారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి.. ఏడాది కిందట జరిగిన విషయాన్ని.. మరింత మసాలాతో ఇప్పుడు బాబు నోటి నుంచి రావటం కాస్త ఆసక్తికరమే. ఎప్పుడూ లేని విధంగా బాబుకు ఇంత ఆవేశం ఎందుకు వచ్చిందో..?
విభజన హేతుబద్ధంగా జరగలేదని ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు వ్యాఖ్యానించినప్పటికీ.. ఇంత భావోద్వేగంతో మాట్లాడింది మాత్రం ఇదే తొలిసారి. విభజన సందర్భంగా రాజధాని లేకుండా చేశారని.. కట్టుబట్టలతో బయటకు పంపారంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 2న నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. టీచర్లు ఒక అరగంట సేపు దీక్ష చేయాలని పిలుపునిచ్చారు.
విభజన సందర్భంగా చాలా అన్యాయంగా.. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. పార్లమెంటులో అరగంట వ్యవధిలో విభజన బిల్లును ఆమోదింపచేశారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి.. ఏడాది కిందట జరిగిన విషయాన్ని.. మరింత మసాలాతో ఇప్పుడు బాబు నోటి నుంచి రావటం కాస్త ఆసక్తికరమే. ఎప్పుడూ లేని విధంగా బాబుకు ఇంత ఆవేశం ఎందుకు వచ్చిందో..?