చంద్రబాబును చిక్కుల్లో పడేసి బాలీవుడ్ జంట

Update: 2016-05-04 08:34 GMT
ఇటీవలే ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన బాలీవుడ్ జంట అజయ్ దేవగణ్ - ఆయన భార్య కాజోల్ పేర్లు తాజాగా పనామా పత్రాల్లో కనిపించడం వివాదాస్పదమవుతోంది.  ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ మనీ కింగుల పేర్లు బయటపెడుతూ సంచలనం సృష్టిస్తున్న పనామా జాబితాలో అజయ్ దేవగణ్ పేరు కనిపించడంతో చంద్రబాబుకు చిక్కొచ్చిపడింది. ఏపీకి బ్రాండింగ్ చేయడానికి ఎంపికైన ఆయనపై నెగటివ్ బ్రాండ్ పడడంతో ఆ మచ్చ ఏపీపైనా పడే ప్రమాదముంది.

బ్రిటన్ లోని వర్జిన్ ఐలాండ్ లో మేరిలిబోన్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో అజయ్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కంపెనీలో కాజోల్ కూడా ఉన్నారు. నల్లధన ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఇప్పుడు అజయ్ - కాజోల్ లను బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగిస్తారో  లేదో చూడాలి.

ఇంతకుముందు ఇన్ క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఆ పదవి పోగొట్టుకున్నాడు. ఆ తరువాత అమితాబ్ కూడా పనామా జాబితాలోకెక్కి పరువు పొగట్టుకున్నాడు. తాజాగా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లు అజయ్ దేవగణ్ - కాజోల్ లు కూడా ఇందులో చిక్కుకోవడంతో వారిని చంద్రబాబు అంబాసిడర్లుగా ఉంచుతారా లేదంటే ఉపసంహరించుకుంటారా అన్నది తేలాల్సి వస్తోంది.  పాపం.. తన తప్పేమీ లేకపోయినా అజయ్ దేవగణ్, కాజోల్ ల దెబ్బకు చంద్రబాబు చిక్కుల్లో పడినట్లయింది.
Tags:    

Similar News