సాయంతం విందు ఉంటే.. పొద్దున్నే బాబు కలిసారే..!

Update: 2015-06-30 08:32 GMT
సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ను.. ఏపీ ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం కలుసుకున్నారు. ప్రోటోకాల్‌లో ఉన్న నిబంధనల్ని అనుసరించి.. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కి చంద్రబాబు వెళ్లలేదు. దీంతో.. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లారు.

అయితే.. మంగళవారం రాత్రి గవర్నర్‌ నేతృత్వంలో రాష్ట్రపతి గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కావాలని మరి ఆహ్వానించారు. సాయంత్రం విందు కార్యక్రమం ఉన్నా.. ఉదయమే రాష్ట్రపతిని చంద్రబాబు కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా పరిణామంతో ఆయన విందుకు హాజరు అవుతారా? అన్నది సందేహంగా మారింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్వల్ప జ్వరానికి గురైన నేపథ్యంలో ఆయన సాయంత్రం విందుకు హాజరవుతారన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News