బ్రేకింగ్ : ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య ?

Update: 2020-03-21 08:36 GMT
మధ్యప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే , కూతురు జ్యోతి  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజస్తాన్‌ రాష్ట్రం బరాన్ జిల్లాలోని బర్ఖేడ గ్రామంలోని తన మెట్టినింట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్దరాత్రి ఆమె ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈమె  పోహారీ నియోజకవర్గం కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే  సురేష్ ధాకడ్ కుమార్తె.  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన 22 మంది సభ్యుల్లో ఆయనా ఒకరు.

బాధితురాలు జ్యోతి భర్త డాక్టర్ జై సింగ్ మెహతాను వివాహం చేసుకుంది. అతడు షాహాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఈ ఘటన పై  కేసు నమోదు చేసుకుని ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News