సంచలనం.. 52వేల కోట్ల విరాళం

Update: 2019-03-14 05:30 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాల రూ.52,750 కోట్ల విరాళం.. ఇందంతా సమాజంపై ప్రేమతో ఇస్తోంది. తనను ఇంతవాన్ని చేసిన దేశ ప్రజలకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త , విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ ఇస్తున్న భారీ విరాళం ఇదీ.. ఇప్పుడు ప్రేమ్ జీ ఇచ్చిన కోట్ల రూపాయల విరాళం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..

సమాజ సేవ కోసం విప్రో అధినేత ప్రేమ్ జీ తన వాటాల్లోని 34శాతాన్ని దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్ కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్ జీ నియంత్రణలో విప్రో సహా పలు సంస్థలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువలోంచి రూ.52,750 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు అజీమ్ ప్రేమ్ జీ తెలిపారు. తన ఫౌండేషన్ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ప్రేమ్ జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన మరిన్ని నిధులు పెంచారు.

అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ దేశంలోని విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు ఇతర విభాగాల్లోని పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ప్రతీ ఏటా భారీ సాయం చేస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఈశాన్య భారత్ లో ప్రేమ్ జీ ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాఠశాల విద్య మెరుగుకోసం శిక్షణ సంస్థలను ప్రేమ్ జీ ఏర్పాటు చేశారు. బెంగళూరులో ప్రేమ్ జీ పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రకటించిన 52750 కోట్లతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమ్ జీ ప్రకటించారు.
   

Tags:    

Similar News