జగన్‌ యాత్రలంటే ఆడోళ్లు భయపడిపోతున్నారంట

Update: 2015-05-25 05:42 GMT
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించి కాస్తంత ఆసక్తికరమైన వ్యాఖ్యను ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేశారు. ఆయన తరచూ చేసే పర్యటనల్ని.. జగన్‌ వ్యవహారశైలిని తప్పు పట్టిన ఆయన.. కాస్తంత వ్యంగంగా.. సరికొత్తగా విమర్శలు చేశారు.

వైఎస్‌ జగన్‌ చేపట్టే యాత్రలంటే ఆడోళ్లు భయపడుతున్నారని.. అమ్మాయిలు అయితే మరింత భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ యాత్రలకు ఆడోళ్ల భయానికి లింకేమిటన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు మాటల్లోనే చెప్పాలంటే.. ''ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి యాత్రలంటే ఆడోళ్లు భయపడుతున్నారు. ఎక్కడ ముద్దు పెడతాడో అని ఆయన్ని చూస్తే పరుగులు పెడుతున్నారు. అమ్మాయిలు అయితే.. మరీ భయపడుతున్నారు'' అంటూ వ్యాఖ్యానించారు.

తన పర్యటనల సందర్భంగా మహిళల్ని అప్యాయంగా దగ్గర తీసుకోవటం.. లాంటి చర్యలపై ఇప్పటివరకూ ఎవరూ వేలెత్తి చూపించకున్నా.. తాజాగా అయ్యన్నపాత్రుడు మాత్రం ఆ అలవాటును తనదైన శైలిలో విమర్శలు చేయటం జగన్‌కు కాస్తంత ఇబ్బంది కలిగించే వ్యవహారమే.
Tags:    

Similar News