రేప్ ల బాబాకు 2 వేలమంది స్పెషల్ ప్రొటెక్షన్

Update: 2015-07-28 09:40 GMT
ఆశారాం బాపూ.. ఈ వివాదాస్పద బాబా గురించి ఇప్పటికే చాలా గుట్లు బయటపడినా తాజాగా వెలుగుచూసిన వాస్తవం వింటే మాత్రం దేశ అంతర్గత భద్రతకు ఇలాంటివారి వల్ల చాలా ప్రమాదమని అర్థమవుతుంది. ఆశారాం బాపూ అనుంగు శిష్యుడు... ఆశారం బాపూ కేసులో ప్రధాన సాక్షిని హతమార్చినవాడు అయిన నారాయణ్ పాండేను పోలీసులు విచారించినప్పుడు భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆశారాం బాపూ వెనుక నిత్యం 2000 మంది ప్రత్యేక సైన్యం ఉంటారట. వారంతా ఆయన కోసం చావడానికైనా ఎవరినైనా చంపడానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదుల్లో ఉండే ఆత్మాహుతి దళం కిందే లెక్క.

షహజాన్ పూర్ లోని 16 ఏళ్ల బాలికపై రేప్ చేశారని ఆశారాం బాపూపై కేసు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ప్రధాన సాక్షి అయిన కృఫాల్ సింగ్ ను ఈ నారాయణ పాండేయే చంపాడు. అంతేకాదు... రేప్ నకు గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని కూడా బెదిరించాడు. పాండేను ఇటీవలే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే ఆయన.... ఆశారం వద్ద ఉన్న 2 వేల సైన్యం గురించి గుట్టు విప్పేశారు. ఆ రెండు వేల మంది చంపడానికైనా చావడానికైనా సిద్ధమేనని పాండే చెబుతుంటే పోలీసులు నోరెళ్లబెట్టారట. ఇదంతా రేప్ లు చేసేవాడికి రెండు వేల మంది రక్షణా అనిపించకమానదు.
Tags:    

Similar News