ఏపీ సర్కార్ కు గవర్నర్ షాక్!

Update: 2020-07-22 07:00 GMT
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ గవర్నర్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు. మే 29నాటి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చినా తనను ఏపీ ప్రభుత్వం తిరిగి నియమించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్.. హైకోర్టు ఆదేశానుసారం తాజాగా గవర్నర్ ను కలిసి విన్నవించుకున్నారు.

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను పలు ఆర్డినెన్స్ లు తెచ్చి తొలగించారు.మరో ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ సర్కార్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.  సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కూడా హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో తాజాగా గవర్నర్ ను కలిసి విన్నవించాలని నిమ్మగడ్డకు హైకోర్టు సూచించింది.

సోమవారం గవర్నర్ ను కలిశారు నిమ్మగడ్డ. తాజాగా ఈరోజు ఆయనను అపాయింట్ చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
Tags:    

Similar News