3 నెలలుగా యూకేలో అవస్థలు పడుతోన్న 61 మంది తెలంగాణ వాసులు!

Update: 2020-06-05 05:45 GMT
మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో 61 మంది తెలంగాణ వాసులు యూకే లో గత మూడు నెలలుగా చిక్కుకొని , నానా అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా ఇక్కడే ఉన్నాం అని, తమను స్వదేశానికి రప్పించాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను వారు కోరారు. మా కుటుంబ సభ్యులు మాకోసం ఎదురు చూస్తున్నారు.ఉద్యోగాలు చేసుకోవాలి.. మూడు నెలలుగా ఇక్కడే ఉండిపోవడంతో ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాగైనా కూడా తమను స్వదేశానికి తీసుకు రావాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌‌ ను అభ్యర్థించారు. హైదరాబాద్ తిరిగి రావడం కోసం నిరీక్షిస్తోన్న వారి వివరాలు యూకేలోని భారత హైకమిషన్ వద్ద ఉన్నాయని, యూకేలో నివసిస్తోన్న తెలంగాణ ప్రజలందరి తరఫున ఈ  పిటిషన్ దాఖలు చేశామని వారు తెలిపారు. అలాగే మేము  61 మంది మాత్రమే కాదు.. వందే భారత్ మిషన్లో భాగంగా యూకే నుంచి తిరిగి రాలేక పోయిన వారు చాలా మంది ఉన్నారని వారు తెలిపారు.

టొరంటో నుంచి లండన్ మీదుగా హైదరాబాద్ రావాల్సిన మహమ్మద్ సొహైల్ అహ్మద్ ఖాన్ ఏప్రిల్ 2న లండ్ నుంచి ఇండియా రావాల్సింది. కానీ విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఆయన అక్కడే చిక్కుకుపోయారు. దీంతో అక్కడ ఉండటానికి ఆహారం కోసం ఆయన భారీగా వెచ్చించాల్సి వస్తోంది. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ రావాలని ఆయన చూస్తున్నారు. ఇలాంటివారు ఒక్క యూకే లోనే కాదు ..ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు. వందే భారత్ మిషన్ లో చాలా మందిని స్వదేశానికి తీసుకు వచ్ఝినప్పటికీ  ఇంకా చాలా మంది ఇతర దేశాల్లో చిక్కుకు పోయారని తెలుస్తుంది.
Tags:    

Similar News