మూడంటే మూడు రూపాయిలు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే సరైన చాక్లెట్ దొరకని పరిస్థితి. అలాంటి మూడు రూపాయిలకు ఒక చీర అంటే ఎవరు మాత్రం ఆశ పడకుండా ఉండరు? ఎవరో సినిమా స్టార్ ను తీసుకొచ్చి.. లక్షల లెక్కన డబ్బులు ఇచ్చినా అందుకు వచ్చే రెస్పాన్స్ ఏమిటో చెప్పలేని పరిస్థితి. అదే 3రూపాయిలకే చీర అంటే జనాలు పోటెత్తటమే కాదు.. సదరు షాపు పేరు ఊరు మొత్తమే కాదు.. పక్కనున్న ఊళ్లల్లోనూ తెలిసిపోయే పరిస్థితి. అందుకేనేమో వరంగల్కు చెందిన కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ భారీ ప్లాన్ వేసింది.
తమ వార్షికోత్సవం సందర్భంగా మూడంటే మూడు రూపాయిలకే చీర ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారీగా ప్రచారం చేపట్టింది. తమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో చీరను మూడు రూపాయిలకే ఇస్తామని.. అంతేకాదు.. మరిన్ని అదిరిపోయే ఆఫర్లు అంటూ ఊరించింది.
ఇంత ప్రచారం చేశాక.. భారీ ఆఫర్లు పెట్టాక ఎవరు మాత్రం ఊరుకుంటారు. వేలాది మంది షాపింగ్ మాల్ ను ముంచెత్తారు. జనాలు వస్తారని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో వస్తారని అంచనా వేయని షాపింగ్ మాల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. మూడు రూపాయిల చీర ఎక్కడ మిస్ అవుతుందోనన్న ఉద్దేశంతో పనులన్నీ ఆపుకొచ్చిన వేలాది మహిళలను కంట్రోల్ చేయటమే కాదు.. షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇవ్వని వైనంతో వారు మండిపడ్డారు. శాపనార్థాలు పెట్టారు. దీంతో.. ఏం చేయాలో తోచని మాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా అర్జెంట్ గా మాల్ ను మూయించేశారు. మూడు రూపాయిలకే చీరను సొంతం చేసుకొని ఎంచక్కా ఇంటికి వెళ్లాలనుకున్న వారికి తీవ్ర ఆశాభంగం వాటిల్లింది. మొత్తంగా చూస్తే.. రూ.3 చీరతో వచ్చే మైలేజీ ఏమో కానీ వేలాది మంది మహిళల శాపనార్థాలు మాత్రం కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ కు భారీగానే దక్కాయని చెప్పక తప్పదు. ఇలాంటి పిచ్చ ఆఫర్లను ప్రజల్ని వెర్రెక్కించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న వాదనలు పలువురు వినిపిస్తున్నారు. తీవ్రమైన రద్దీతో జరగరానిది జరిగితే ఎవరు అందుకు బాధ్యతవహిస్తారన్న ప్రశ్నను అర్థం చేసుకోవచ్చు.
తమ వార్షికోత్సవం సందర్భంగా మూడంటే మూడు రూపాయిలకే చీర ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారీగా ప్రచారం చేపట్టింది. తమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో చీరను మూడు రూపాయిలకే ఇస్తామని.. అంతేకాదు.. మరిన్ని అదిరిపోయే ఆఫర్లు అంటూ ఊరించింది.
ఇంత ప్రచారం చేశాక.. భారీ ఆఫర్లు పెట్టాక ఎవరు మాత్రం ఊరుకుంటారు. వేలాది మంది షాపింగ్ మాల్ ను ముంచెత్తారు. జనాలు వస్తారని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో వస్తారని అంచనా వేయని షాపింగ్ మాల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. మూడు రూపాయిల చీర ఎక్కడ మిస్ అవుతుందోనన్న ఉద్దేశంతో పనులన్నీ ఆపుకొచ్చిన వేలాది మహిళలను కంట్రోల్ చేయటమే కాదు.. షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇవ్వని వైనంతో వారు మండిపడ్డారు. శాపనార్థాలు పెట్టారు. దీంతో.. ఏం చేయాలో తోచని మాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా అర్జెంట్ గా మాల్ ను మూయించేశారు. మూడు రూపాయిలకే చీరను సొంతం చేసుకొని ఎంచక్కా ఇంటికి వెళ్లాలనుకున్న వారికి తీవ్ర ఆశాభంగం వాటిల్లింది. మొత్తంగా చూస్తే.. రూ.3 చీరతో వచ్చే మైలేజీ ఏమో కానీ వేలాది మంది మహిళల శాపనార్థాలు మాత్రం కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ కు భారీగానే దక్కాయని చెప్పక తప్పదు. ఇలాంటి పిచ్చ ఆఫర్లను ప్రజల్ని వెర్రెక్కించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న వాదనలు పలువురు వినిపిస్తున్నారు. తీవ్రమైన రద్దీతో జరగరానిది జరిగితే ఎవరు అందుకు బాధ్యతవహిస్తారన్న ప్రశ్నను అర్థం చేసుకోవచ్చు.