డీకే అరుణను గెలిపిస్తే విమానంలో అయోధ్యకు?

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఈనెల 13నే పోలింగ్ ఉండటంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

Update: 2024-05-06 01:30 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఈనెల 13నే పోలింగ్ ఉండటంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఎవరి తల రాత మారుతుందో తెలియడం లేదు. ఏ అభ్యర్థులను గెలిపిస్తారో అంచనా వేయడం కష్టమే అంటున్నారు.

ఈనేపథ్యంలో తమ పార్టీ నేతలను గెలిపిస్తే తాయిలాలు ఇస్తామని చెబుతున్నారు. తీర్థయాత్రలు చేయిస్తామని అంటున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఓ బంపరాఫర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్న డీకే అరుణను గెలిపిస్తే విమానంలో తీసుకెళ్లి అయోధ్య రామయ్య దర్శనం చేయిస్తానని హామీ ఇచ్చారు.

దీంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ సొంత ఖర్చులతో అయోధ్యకు విమానంలో తీసుకెళ్లి రామయ్య దర్శనం చేయిస్తానని చెప్పడంతో వారు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తమ నేతను గెలిపించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కంటి మీద కుకును లేకుండా తిరుగుతున్నారు.

మహబూబ్ నగర్ లో కాషాయ జెండా రెపరెపలాడాలని కలలు కంటున్నారు. తమ నేత ఇస్తున్న ఆఫర్ కు మురిసిపోతున్నారు. విమానంలో ప్రయాణమంటేనే వారికి ఏదోలా ఉందని అంటున్నారు. డీకే అరుణను గెలిపించి తీరుతామని చెబుతున్నారు. తమ నేత ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తీరుతామని ప్రతిన బూనారు.

మహబూబ్ నగర్ లో ప్రతి కార్యకర్త అరుణను గెలిపించుకోవాలని చూస్తున్నారు. అరుణ గెలుపే లక్ష్యంగా కదులుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని అంటున్నారు. రాబోయే ఎన్నికలో ఇక్కడ బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమే అనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో దక్షిణాదిలో పట్టుకోసం బీజేపీ చేస్తున్న శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుందని అంటున్నారు.

Tags:    

Similar News