వియ్యంకుడి 'విక్టరీ' కోసం ప్రచారం... ఖమ్మంలో వెంకీ సందడి!

ఈ క్రమంలో... స్థానిక మయూరి సెంటర్ నుంచి ప్రారంభించిన రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేష్ ముందుకు కదిలారు! దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి

Update: 2024-05-07 17:37 GMT

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ తేదీకి ఇంకా వారం రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇదే సమయంలో నేతలతో పాటు, వారి వారి కుటుంబ సభ్యులు, స్టార్ క్యాంపెయినర్ల సందడి ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ పాల్గొన్నారు!

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు, నేతలతో పాటు వారి వారి కుటుంబ సభ్యులు, స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. అయితే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సాధారణంగా సినీ నటులతో ఎన్నికల ప్రచారం కాస్త తక్కువగానే, అరుదుగానే ఉంటుందని అంటున్నారు.

ఈ సమయంలో తెలంగాణ లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మంలో సినిమా హీరో విక్టరీ వెంకటేష్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా... ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి ఓటు వేయాలంటూ విక్టరీ వెంకటేష్ ఓటర్లను కోరారు.

Read more!

ఈ క్రమంలో... స్థానిక మయూరి సెంటర్ నుంచి ప్రారంభించిన రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేష్ ముందుకు కదిలారు! దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా తనదైన శైలి పలకరింపులో భాగంగా చూపుడు వేలుతో విష్ చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వెంకీ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపించింది!

కాగా... ఇప్పటికే సుమారు వారం రోజులుగా వెంకటేష్ కుమార్తె ఆశ్రిత.. తన మామ రఘురాంరెడ్డి గెలుపుకోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... రఘురాంరెడ్డికి ఓటు వేయాలంటూ ఆమె ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఇదే క్రమంలో.. పలు బహిరంగ సభల్లోనూ, ఆత్మీయ సమ్మేళనాల్లోనూ పాల్గొని ప్రసంగించారు.

Tags:    

Similar News