వైసీపీ టాక్: 'రెడ్ బుక్'ను లైట్ తీసుకున్నారా?
''రెడ్ బుక్''ను లైట్ తీసుకున్నాం.. అంటూ వైసీపీ నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో గుబులు రేపుతున్నాయి.;

''రెడ్ బుక్''ను లైట్ తీసుకున్నాం.. అంటూ వైసీపీ నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో గుబులు రేపుతున్నాయి. రెడ్ బుక్ పేరుతో మంత్రి నారా లోకేష్.. ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరు అరెస్టు అయినా.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారంటూ.. చాలా మంది వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, సజ్జల మాత్రం దీనిని తాము లైట్ తీసుకున్నందుకే.. ఇబ్బందులుపడుతున్నామన్నారు.
అంటే.. పరోక్షంగా వైసీపీ అధికారంలో ఉండగా.. నారా లోకేష్ చేసిన హెచ్చరికలను తోసిపుచ్చి.. నాయకు లు చెలరేగిపోయారన్న విషయాన్ని సజ్జల అంగీకరించినట్టు అయింది. అయితే.. దీనికి కొందరు నాయకు లు తప్పుబడుతున్నారు. ''దీనిని అందరికీ ఆపాదించడం సరికాదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో.. వారి పేర్లు చెప్పాలి. మేం ఎప్పుడూ హద్దులు మీరలేదు.'' అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
మరికొందరు నాయకులు కూడా.. సజ్జల చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రెడ్ బుక్..రెడ్ బుక్ అని.. వ్యా ఖ్యానించడం సరికాదని.. తప్పులు చేయొద్దని ఆనాడే.. ఎమ్మెల్యేలుగా తాము చెప్పామని.. ఈ ఒక్కసారి జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా చెప్పామని.. కానీ, అధినేత తమ ను కనీసం దగ్గరకు రానివ్వలేదని తూర్పుకు చెందిన ఓ మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. మొత్తంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై పార్టీలోనే తిరుగుబాటు ఎదురవుతోంది.
రెడ్ బుక్ పేరిట రాజకీయాలు చేసింది.. మనమేనని మరికొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల చేయాల్సిన వారిని గాలికి వదిలేసి.. ఇప్పుడు అందరినీ దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే.. సజ్జల మాత్రం.. ఇంతకు ఇంత అనుభ విస్తారని చెప్పారు. కానీ.. వైసీపీ నాయకులు దీనిని కూడా తప్పుబడుతున్నారు. కూటమి బలంగా ఉందని.. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలను మనవైపు తిప్పుకొనే వ్యూహాలకు పదును పెంచాలని వారు సూచిస్తున్నారు.