సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్!

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన... 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ నుంచి వచ్చిన ఆ బోర్డు చాలా అవుట్ డేటెడ్ అని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-05-23 10:10 GMT
సెన్సార్  బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్!

దేశంలోనూ, ప్రపంచంలోనూ జరిగే పలు సంఘటనలు.. పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ, తనదైన విశ్లేషణలు చేసే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఆర్జీవీ... సెన్సార్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డ్ చాలా అవుట్ డేటెడ్ వ్యవస్థ అని అన్నారు.

అవును... సెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన... 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ నుంచి వచ్చిన ఆ బోర్డు చాలా అవుట్ డేటెడ్ అని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బోర్డులో ఉండే ఐదుగురు సభ్యులు.. కోట్ల మంది అభిరుచిని వాళ్లు ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డ్ జ్యూరీలో సోషల్ సైంటిస్టులు ఏమీ ఉండరని అన్నారు!

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ... సెన్సార్ బోర్డ్ అనేది చాలా పాత బడిన వ్యవస్థ.. అది 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ నుంచి వచ్చింది. అప్పట్లో డిజిటల్, శాటిలైట్, టెలివిజన్, యూట్యూబ్, స్మార్ట్ ఫోన్ లేవని అన్నారు. అయితే ప్రస్తుతం ఓ వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతుందో తెలుసుకునే సోషల్ మీడియా యుగంలో ఉన్నాడని అన్నారు!

అలాంటి ఈ రోజుల్లో ఓ పర్టిక్యులర్ 10 మంది ఇది చూస్తే సరికాదు, అది చూస్తే సరికాదని చేయడం అనేది స్టుపిడెస్ట్ థింగ్ అని అన్నారు! ఇంటర్నెట్ యాక్సెస్ తో రియల్ లైఫ్ వయలెన్స్, పో*ర్న్, వయలెన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయని.. అలాంటప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం క్రియేట్ చేసే సినిమాలోని కొన్ని పదాలకు అభ్యంతరం చెప్పడం కంటే స్టుపిడిటీ ఏముంటుందని ప్రశ్నించారు.

అలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను డంబ్ అని భావించే సెన్సార్ బోర్డు సభ్యులు.. ప్రేక్షకులను పిల్లలను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని.. జ్యూరీలో ర్యాండమ్ పీపుల్ ఉంటారని.. వాళ్లేమీ మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు ఉండరని అన్నారు! అలాంటి ఐదుగురు సభ్యులు కోట్ల మంది అభిరుచిని ఎలా నిర్ణయిస్తారని అడిగారు ఆర్జీవీ.

దీంతో... ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడతారని ఒకరంటే.. ఇంటర్నెట్ లో ‘బూతు’ సింగిల్ గా చూస్తారు!.. సినిమా 70ఎంఎం స్క్రీన్ పై ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారు.. ఆ మాత్రం ఆలోచన లేకపొతే ఎలా అని మరికొందరు స్పందిస్తున్నారు.

Tags:    

Similar News