అదే జరిగితే సీఎం రేవంత్ కాదు..గ్లోబల్ టెక్ విజనరీ ఇమేజ్
కొన్నిసార్లు అద్భుతాలు సాదాసీదాగా షురూ అవుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక దేశ రాజకీయ రంగంలో చోటు చేసుకుంది.;
కొన్నిసార్లు అద్భుతాలు సాదాసీదాగా షురూ అవుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక దేశ రాజకీయ రంగంలో చోటు చేసుకుంది. జాతీయ.. అంతర్జాతీయ దిగ్గజాలు ఉన్న వేదిక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రసంగించేందుకు పదకొండు నిమిషాల సమయం లభించింది. ఆయన ప్రసంగించే సమయంలో.. ఆ వేదిక వద్ద ఉండి.. ఆయన మాటల్ని విన్న రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు టెక్ దిగ్గజాల జాబితాను చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. తనకు లభించిన సమయాన్ని అద్భుతంగా వినియోగించుకున్న రేవంత్ ను ఇప్పుడు సాదాసీదా ముఖ్యమంత్రిగా చూసే పరిస్థితి లేదు. ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన గ్లోబల్ టెక్ విజనరీ.
ఈ మాటకు తగ్గట్లే ఆయన ఏఐ సమ్మిట్ ప్రసంగం ఉండటంతోపాటు.. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆయన ప్రసంగం అనంతరం చప్పట్లతో అభినందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ అందరి కంట్లో పడటమే కాదు.. ఆయనతో పలువురు మాట్లాడే ప్రయత్నం చేయటం కనిపించింది. ఇంతకూ రేవంత్ స్పీచ్ ఇచ్చే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారో చూస్తే.. ఆయన ప్రసంగం ఎంత మందిని ఆయన వైపు చూసేలా.. ఆయన గురించి తెలుసుకునేలా చేసిందో అర్థమవుతుంది. ఇంతకూ సీఎం రేవంత్ స్పీచ్ ఇచ్చే వేళలో అక్కడ ఎవరెవరు ఉన్నారన్న వివరాల్ని చూస్తే..
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
- బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా
- భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే
- గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్
- నెదర్లాండ్స్ ప్రధాని డిక్ షూఫ్
- ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పొ
- ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్
- స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని
- స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్
- యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కజకిస్థాన్ ప్రధాని ఒల్జాస్ బెక్టెనోవ్
- మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్గూలం
- సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్
- ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్
- పలువురు కేంద్ర మంత్రులు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
- అస్సాం ముఖ్యమంత్రి హిమంతు బిశ్వశర్మ
టెక్ దిగ్గజాలు
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
- ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్
- మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్
- అడోబ్ సీఈఓ శంతను నారాయణ్
- ఎన్విడియా ప్రతినిధులు
- ముఖేశ్ అంబానీ
- టాటా సన్స్ నటరాజన్ చంద్రశేఖరన్
- సునీల్ భారతి మిట్టల్
- నందన్ నిలేకని
- ఇన్పోసిస్ సీఈవో సలీల్ పరేఖ్
- హెచ్ సీఎల్ టెక్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా
- హెచ్ సీఎల్ టెక్ సీఈవో సి విజయకుమార్
- సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి
- జోహో కార్పొరేషన్ కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు
- పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఆనంద్ దేశ్ పాండే
- జయ్ చౌదరి