దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు.. తెరపైకి కీలక విషయాలు!

ఈ సమయంలో తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.;

Update: 2025-06-01 10:45 GMT
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు.. తెరపైకి కీలక విషయాలు!

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ లోని పాకిస్థాన్ గూఢచర్యానికి సహకరించిన వారి విషయాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. మరికొందరిని రిమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు చేపట్టింది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాల్లో పాక్ గూఢచర్యానికి సహకరిస్తున్న భారతీయుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో సుమారు 8 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా... ఢిల్లీ, ముంబై, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ క్రమంలో... పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోందని అంటున్నారు. ఈ దాడుల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కొన్ని ఆర్థిక పత్రాలు ఎన్ఐఏ కి దొరికాయని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... పాకిస్థాన్ నుంచి గూఢచర్యం రాకెట్ నడిపిస్తున్న ఆపరేటివ్ ల సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని విశ్లేషిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో వీరికి గూఢచర్యానికి అవసరమైన ఆర్థిక సహకారాలు అందినట్లు అనుమానిస్తున్నారు!

కాగా... ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, సహ్ దేవ్ సింగ్, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్, రక్షణ శాఖలోని మెకానికల్ ఇంజినీర్ రవీంద్ర వర్మ, మాజీ మంత్రి పీఏ షాకుర్ ఖాన్, బిజినెస్ మేన్ షాజాద్ సహా పలువురిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News