ఆపరేషన్ సింధూర్.. దేశ ప్రజల మూడ్ మార్చేసింది..

ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్ లోని ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఈ చర్య దేశ ప్రజలను ఐక్యం చేసింది.;

Update: 2025-05-31 15:30 GMT
ఆపరేషన్ సింధూర్.. దేశ ప్రజల మూడ్ మార్చేసింది..

ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్ లోని ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఈ చర్య దేశ ప్రజలను ఐక్యం చేసింది. ఐక్యంగా పాక్ పై పోరాటం చేసేలా చేసింది. భారత ప్రభుత్వ చర్యను దేశ ప్రజలందరూ సమర్థించేలా చేసింది. దేశంలోనే కాదు.. ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. 'గ్లోబల్ ఆప్టిమిస్టిక్ ఇండెక్స్'లో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇది దేశ ప్రజలలో ఆశావాదం.. ప్రభుత్వ నిర్ణయాలపై విశ్వాసం ఎంతగా పెరిగిందో తెలియజేస్తుంది.

తాజా సర్వే ప్రకారం..., 65 శాతం మంది ప్రజలు దేశం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవని అభిప్రాయపడ్డారు. గతేడాది ఈ స్కోరు 62 శాతంగా ఉండగా, ఈ ఏడాది గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇది దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంస్కరణలు, , ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల పట్ల ఉన్న సానుకూల దృక్పథానికి నిదర్శనం.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రజలు తమ దేశం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎంత సంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తారు. ఈ సూచిక దేశ పౌరులలో ఉన్న విశ్వాసాన్ని, ఆశావాదాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రస్తుతం సింగపూర్, మలేషియా, ఇండోనేషియా తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. ప్రపంచ సగటు స్కోరు 37 శాతంగా ఉండగా, భారత్ 65 శాతం స్కోరుతో సగటును గణనీయంగా అధిగమించడం విశేషం. ఇది ప్రపంచ స్థాయిలో భారత్ సాధించిన ప్రగతిని, దేశ భవిష్యత్తుపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది.

ఆపరేషన్ సిందూర్ వంటి కార్యక్రమాలు దేశంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాల పట్ల విశ్వాసం దేశ పురోగతికి మరింత దోహదపడతాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో భారత్ ఈ సూచికలో మరింత మెరుగైన స్థానాలను సాధిస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News