కేఏ పాల్ సామాన్యుడు కాదా...నిముష ప్రియ మ్యాటర్ లో !
ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసిందని కేఏ పాల్ ప్రకటించారు. యెమెన్ రాజధాని సనా జైలు నుంచి నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని కూడా చెప్పారు.;
కేఏ పాల్ అంటే అంతా ఒక విధంగా హాస్యంగా చూస్తారు. ఆయన ఏమి మాట్లాడినా జోక్ గానే తీసుకుంటారు. కానీ పాల్ మాత్రం సీరియస్ గానే అన్ని విషయాలు చెబుతారు. ఆయన ఒక డేటాని తన వద్ద ఉంచుకునే మీడియా సమావేశాలు పెడుతూంటారు. ఆయన నేను ఫలానా వారిని కలిశాను ఆయన తెలుసు అని పెద్ద నాయకుల గురించి చెబుతూంటే ఏమో కామెడీ అని అంతా అనుకుంటారు.
కానీ యెమెన్ లో జైలులో ఉన్న కేరళ నర్సు నిమిష ప్రియ విషయంలో ఆయన సీరియస్ గానే ప్రయత్నాలు చేశారు అని అంటున్నారు ఆయన తాజాగా యెమెన్ రాజధాని సనా నుంచి ఒక వీడియో సందేశం భారత్ కి పంపించారు. అందులో నిముష ప్రియ సేఫ్ అని చెప్పారు. ఆమె మరణ శిక్ష రద్దు అయింది. ఇక ఆమె క్షేమంగా భారత్ తిరిగి వస్తుందని చెప్పారు.
ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసిందని కేఏ పాల్ ప్రకటించారు. యెమెన్ రాజధాని సనా జైలు నుంచి నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని కూడా చెప్పారు. ఆమెని ఉరి శిక్ష నుంచి తప్పించే విషయంలో తాను గత పది రోజులుగా రాత్రి పగలూ కష్టపడ్డాను అని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
తన ప్రయత్నాలకు యెమెన్ అధికారులు భారత ప్రభుత్వం ఎంతో సహకరించాయని ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసిన కృషి ఫలించిందని ఆయన అన్నారు. ఇక నిమిష ప్రియను క్షేమంగా భారత్ కి తీసుకుని వెళ్ళడానికి భారత్ దౌత్య అధికారులు పంపించేందుకు అంగీకరించింది అని ఆయన అన్నారు.
నిజానికి నిమిష ప్రియ విషయం చాలా క్లిష్టతరంగా మారింది. ఒకానొక టైం లో ఆమె మరణం ఖాయమని అనుకున్నారు. కేంద్రం సైతం సుప్రీం కోర్టులో ఈ వ్యాజ్యం మీద మాట్లాడుతూ తాము చేయగలిగినంత చేశామని చెప్పుకొచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ఆమె ఉరి శిక్ష రద్దు అయింది.
ఇపుడు చూస్తే ఆమె క్షేమంగా భారత్ వస్తోందని పాల్ చెబుతున్నారు ఆయన ఏకంగా యెమెన్ రాజధాని సనా నుంచి వీడియో చేయడంతో ఆయన సామాన్యుడు కాదని అంతా అంటున్నారు. కేఏ పాల్ గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రజల దృష్టిలో ఒక విధంగా ఉంటూ వచ్చారు. కానీ ఇపుడు నిమిష ప్రియ కేసు కనుక సక్సెస్ అయితే మాత్రం కేఏ పాల్ గ్రేట్ అనే చెబుతారు అంతా.
మరి ఆయన చేసిన దౌత్య పరమైన చర్యలు ఏమిటి అన్నది చూడాలి. ఒక ముస్లిం దేశంలో ఉరి శిక్ష వేయడం వరకూ ఓకే కానీ రద్దు కావడం ఆషామాషీగా జరగదు. అయితే కేఏ పాల్ గతంలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే అంతర్జాతీయ సంస్థను నిర్వహించి అనేక దేశాలు తిరిగారు. ఆయనకు అన్ని చోట్లా పరిచయాలు అయితే ఉన్నాయని ఈ విషయంలో అంగీకరించాల్సి వుంది అంటున్నారు.