మాజీ ఉపరాష్ట్రపతి షాకింగ్ నిర్ణయం : పొలిటికల్ సర్కిళ్లలో హట్ టాపిక్
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజస్థాన్ శాసనసభ మాజీ సభ్యుడిగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.;
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజస్థాన్ శాసనసభ మాజీ సభ్యుడిగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తుపై శాసనసభ కార్యాలయం అవసరమైన ప్రక్రియలు ప్రారంభించింది.
ధనఖడ్ 1993లో అజ్మేర్ జిల్లాలోని కిషన్గఢ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై 10వ రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998 వరకు కొనసాగింది. 1994 నుండి 1997 వరకు శాసనసభ రూల్స్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు.
రాజస్థాన్లో ప్రతి మాజీ ఎమ్మెల్యేకు నెలకు రూ.35,000 పింఛన్ లభించే హక్కు ఉంది. వయస్సు ఆధారంగా అదనపు పెరుగుదల కూడా కలదు. 70 ఏళ్లు దాటిన మాజీ ఎమ్మెల్యేలకు 20 శాతం అదనపు పింఛన్ లభిస్తే, 80 ఏళ్లు దాటితే 30 శాతం అదనంగా ఇస్తారు.
ప్రస్తుతం 74 ఏళ్ల వయస్సున్న ధనఖడ్కు 20 శాతం అదనపు పింఛన్ లభిస్తుంది. అందువల్ల ఆయనకు నెలకు సుమారుగా రూ.42,000 పింఛన్గా లభించనుంది. భవిష్యత్తులో ఆయన వయస్సు 80 దాటినప్పుడు పింఛన్ మొత్తంలో 30 శాతం పెరుగుదల కలుగుతుంది.
ధనఖడ్ దరఖాస్తును స్వీకరించినట్లు రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నానీ తెలిపారు. సంబంధిత అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆయనకు పింఛన్ జమ అవుతుంది.
ధనఖడ్కి సుదీర్ఘమైన ప్రజాసేవా అనుభవం ఉంది. రాజస్థాన్ ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా లోక్సభ సభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా కూడా సేవలందించారు. 2022లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టంగా నిలిచింది. తాజా దరఖాస్తుతో రాజస్థాన్ శాసనసభ పింఛన్ పొందే మాజీ ఎమ్మెల్యేల జాబితాలో ఆయన చేరారు.