లోకేష్కు ఇక ఫుల్ 'పవర్స్' ఇచ్చినట్టేనా ..!
ఇప్పటి వరకు చంద్రబాబు అంటే.. భయం ఉన్న వారు.. భక్తి ఉన్నవారు.. ఇప్పుడు ఆయనతో పాటు.. నారా లోకేష్ విషయంలోనూ ఈ రెండూ ప్రదర్శిస్తున్నారు;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్కు పార్టీపై దాదాపు ఫుల్ పవర్స్ ఇచ్చారా? నాయకులు, కార్యకర్తలపై లోకేష్ నియంత్రణ ఇకపై స్పష్టంగా కనిపిస్తోందా? అంటే.. నాయకుల అంతర్గత సమావేశాల్లో ఔనన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు అంటే.. భయం ఉన్న వారు.. భక్తి ఉన్నవారు.. ఇప్పుడు ఆయనతో పాటు.. నారా లోకేష్ విషయంలోనూ ఈ రెండూ ప్రదర్శిస్తున్నారు. దీనికి కీలక కారణం.. గత వారం.. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనలే!.
దారి తప్పుతున్న నాయకులను, ముఖ్యంగా ప్రజలకు చేరువ కాని నాయకులను ఉద్దేశించి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అదేసమయంలో పార్టీ గీత దాటి వ్యాఖ్యలు చేసిన వారిని.. ``మీకు అంత నమ్మ కం ఉంటే.. స్వతంత్రంగా పోటీ చేసి విజయం దక్కించుకోవచ్చు`` అని కూడా కుండ బద్దలు కొట్టారు. పార్టీలో ఉంటే.. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈహెచ్చరికలు పార్టీలో బాగానే పనిచేశాయి. నిజానికి ఇప్పటి వరకు చంద్రబాబు సెంట్రిక్గానే నాయకులు పనిచేస్తూ వచ్చారు.
కొందరు మాత్రమే నారా లోకేష్పరిధిలో ఉన్నారన్నది పార్టీ నాయకులు చెబుతున్న మాట. కానీ, తాజాగా గత వారం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇకపై.. నారా లోకేష్ కూడా పార్టీ కార్యక్రమాలు, నాయకుల వ్యవహార శైలిపై దృష్టి పెడుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఫుల్ పవర్ వచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. నిజానికి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
కానీ, ఎవరో ఒకరి అజమాయిషీ ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో నే రెండు రోజుల కిందట ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కొంద రు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ``లోకేష్ చేసిన హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయి. పార్టీ సరిగా ఉండాలి. సిద్ధాంతాల ప్రాతిపదికన అందరూ పనిచేయాల్సిందే.`` అని తేల్చి చెప్పడం ద్వారా.. లోకేష్కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇక, నారా లోకేష్ కు దాదాపు ఫుల్ పవర్ ఇచ్చేసినట్టుగానే నాయకులు భావిస్తుండడం గమనార్హం.