తెల్ల కార్డు ఉంటే అక్కడ అన్నీ చౌకగానే!

అయితే కేవలం బియ్యం మాత్రమే ఇప్పటిదాకా రేషన్ గా ఇచ్చేవారు. కానీ రేషన్ దుకాణాలలో దానితో పాటు నిత్యావసర సరుకులను కూడా చౌక దుకాణాలలో ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.;

Update: 2025-05-29 00:30 GMT
తెల్ల కార్డు ఉంటే అక్కడ అన్నీ చౌకగానే!

ఏపీలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ ని ఇంటింటికీ వచ్చే వాహనాల వద్ద ఇవ్వరన్నది తెలిసిందే. దీని మీద ఈ నెల 20న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు గతంలో మాదిరిగా రేషన్ దుకాణాల వద్దనే రేషన్ సరుకులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే కేవలం బియ్యం మాత్రమే ఇప్పటిదాకా రేషన్ గా ఇచ్చేవారు. కానీ రేషన్ దుకాణాలలో దానితో పాటు నిత్యావసర సరుకులను కూడా చౌక దుకాణాలలో ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానితో రేషన్ దుకాణాలకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. బియ్యంతో పాటు పంచదార, వంట నూనె, అలాగే కందిపప్పు కూడా చౌక ధరలకే ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో నాలుగు రకాలైన సరుకులు చౌకగా లభించనున్నాయన్న మాట. అంతే కాదు బియ్యం ఉచితంగా లభిస్తుంది అన్నది తెలిసిందే.

దాంతో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఇది శుభవార్తగా భావిస్తున్నారు. చాలా కాలంగా రేషన్ అంటే కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దాంతో బియ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇపుడు ఇతర నిత్యవసరాలను ఇవ్వడం ద్వారా తెల్ల కార్డుదారులకు మేలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరో వైపు చూస్తే కనుక రేషన్ సరకులు మరిన్ని భవిష్యత్తులో పెంచే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. దాని వల్ల చౌక దుకాణదారులకు సైతం మేలు జరుగుతుందని భావిస్తున్నారు. రేషన్ డీలర్లు అయితే మామూలుగా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ అంటే కొంత ఆలోచిస్తారు. అనేక రకాలైన సరకులు రేషన్ దుకాణాల ద్వారానే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు భవిష్యత్తులో పేదలకు అవసరమైన వస్తువులు అన్నీ కూడా సబ్సిడీ ధరలకు చౌక దుకాణాలే కేంద్రంగా అమ్మాలని ఆలోచన చేయడం వల్ల అందరికీ లబ్ది కలుగుతుందని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యం ఉంది. గతంలో 2014 నుంచి 2019 దాకా సాగిన చంద్రబాబు ప్రభుత్వంలో సబ్సిడీ మీద అనేక సరుకులు రేషన్ దుకాణాలలో విక్రయించేవారు. తిరిగి అలాంటి పరిస్థితి తీసుకుని రాబోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు చౌక దుకాణాలకు పూర్వ వైభవం కలిగించడం ద్వారా డీలర్లకు కూడా మంచి ఉపాధి కల్పించాలని చూస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే రేషన్ నిల్వలను పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ దుకాణాలకు తరలించే కార్యక్రమం మొదలైంది అని అంటున్నారు. పకడ్బందీగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇంకో వైపు చూస్తే రేషన్ దుకాణాలు పూర్తి పనిగంటలతో నిర్దేశించిన వేళలల తెరచేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News