ఏపీలో 11 మందికి సర్కార్ గుడ్ న్యూస్... ఎవరెవరంటే..!

ఆంధ్రప్రదేశ్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఛైర్మన్లను నియమించింది.;

Update: 2025-11-22 16:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు తాజాగా 11 సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అవును... ఏపీలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్లకు సంబంధించి కొత్త ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా.. వివిధ సామాజిక వర్గాలు, వృత్తులు, ప్రాంతీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నూతన ఛైర్మన్లను ఆదేశించింది.

నియమితులైన ఛైర్మన్ల జాబితా ఈ విధంగా ఉంది!:

పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ - కల్యాణం శివ శ్రీనివాసరావు

ఏపీ స్టేట్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆన్‌ ఛైల్డ్‌ లేబర్‌ - సత్యనారాయణ రాజు

ఏపీ అఫిషియల్‌ లాంగ్వేజ్‌ కమిషన్‌ - విక్రమ్‌

ఉర్దూ అకాడమీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - మౌలానా షిబిలీ

ఫిషర్‌ మెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ - రామ్‌ ప్రసాద్‌

పల్నాడు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ - మధుబాబు

స్టేట్‌ రెడ్డిక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ సొసైటీ - శంకర్‌ రెడ్డి

కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ - మిన్నప్ప

స్టేట్‌ షేక్‌, షీక్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ సొసైటీ - ముక్తియార్‌

భట్రాజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ - వెంకటేశ్వరరాజు

పెరిక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ సొసైటీ – వీరభద్రరావు

కాగా... ఆంధ్రప్రదేశ్ లో 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. బీసీ కార్పొరేషన్ లో 42, ఓసీ కార్పొరేషన్ లో 40, ఎస్సీ కార్పొరేషన్ లో 23, మైనార్టీ కార్పొరేషన్ లో 15 మంది డైరెక్టర్లను ప్రకటించింది.

Tags:    

Similar News