ఆరు నెలలకు అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌

ఆ వార్తలన్ని పుకార్లే అని, ఆ ప్రచారం అంతా కూడా అబద్దం అని ధ్రువ్‌ పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పాడు.

Update: 2024-05-06 09:32 GMT

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ ఇప్పటికే అర్జున్‌ రెడ్డి రీమేక్ అయిన ఆదిత్య వర్మ మరియు తండ్రి తో కలిసి మహాన్‌ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. మొదటి సినిమా రీమేక్ అయినా కూడా నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు చక్కగా ఉపయోగపడింది.

మహాన్‌ లో తండ్రికి పోటీ అన్నట్లుగా నటించి మెప్పించాడు. తదుపరి సినిమా విషయంలో ధ్రవ్‌ ఆలస్యం చేస్తూ ఉండటంతో తమిళ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో అతడి నుంచి మూడో సినిమా రాదేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ధ్రువ్‌ కి సినిమాలపై ఆసక్తి లేదనే ప్రచారం కూడా కొందరు చేశారు.

ఆ వార్తలన్ని పుకార్లే అని, ఆ ప్రచారం అంతా కూడా అబద్దం అని ధ్రువ్‌ పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పాడు. కొన్ని నెలలో క్రితం ధ్రువ్‌ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ అనే వార్తలు వచ్చాయి. అధికారింగా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు ధ్రువ్‌ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చింది. చిత్ర యూనిట్‌ సభ్యులు మొత్తం సింగిల్ ఫ్రేమ్‌ లో కూర్చుని సినిమా అనౌన్స్‌మెంట్‌ కోసం ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ధ్రువ్‌ మరోసారి నటుడిగా మెప్పించడంతో పాటు హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more!

పా రంజిత్‌ శిష్యుడు అయిన మారి సెల్వరాజ్ ఇప్పటికే పరియేరుం పెరుమాల్‌ సినిమాతో జాతీయ అవార్డు అందుకోవడంతో పాటు, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి హిట్‌ అందుకున్నాడు. కనుక ఈ సినిమా కూడా కచ్చితంగా ధ్రువ్‌ కి హిట్‌ ను ఇవ్వడం ఖాయం.

తన శిష్యుడు అయిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను స్వయంగా పా రంజిత్ నిర్మించబోతున్నాడు. హీరోయిన్‌ గా అనుపమ పరమేశ్వరన్ నటించడం వల్ల తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News