ఆ రెండు సక్సెస్ లతో వాళ్లిద్దరు కాన్పిడెంట్ గా!
ఒకప్పుడు ఫ్యామిలీ కథలకు ప్రేక్షకులు పెద్ద పీట వేసేవారు. కానీ కాల క్రమంలో ఆ జానర్ కు ప్రాధాతన్యత తగ్గింది.
ఒకప్పుడు ఫ్యామిలీ కథలకు ప్రేక్షకులు పెద్ద పీట వేసేవారు. కానీ కాల క్రమంలో ఆ జానర్ కు ప్రాధాతన్యత తగ్గింది. కాలంతో పాటు వచ్చిన కొన్ని మార్పులతో ఆ జానర్ బలహీన పడింది. అయితే ఇటీవల కాలంలో మళ్లీ కుటుంబ కథలకు ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. ఫ్యామిలీ కథనే కొత్తగా చెప్పగలిగే దర్శకులు ఈజీగా సక్సెస్ అవుతున్నారు. అందులో అనీల్ రావిపూడి , వెంకీ అట్లూరీ ముందు వరుసలో ఉన్నారు.
తాజాగా విడుదలైన `విశ్వనాథ్ అండ్ సన్స్`, `మా ఇంటి బంగారం` వంటి క్లీన్ ఫ్యామిలీ డ్రామాలు అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఏ మాత్రం వల్గారిటీ లేకుండా స్వచ్ఛమైన కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ భారీ విజయాలు ఇచ్చిన జోష్తో టాలీవుడ్ మేకర్స్ అందరి దృష్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ల వైపు మళ్లింది.
ఈ రెండు సినిమాల అఖండ విజయంతో చిత్ర పరిశ్రమలో సరికొత్త ఆత్మవిశ్వాసం నెలకొంది. నేటి ప్రేక్షకులు కేవలం విజువల్స్ , ఫైట్లకే కాకుండా, హృదయానికి హత్తుకునే బంధాలు, సెంటిమెంట్లు ఉన్న కథలను కూడా ఆదరిస్తారని ఈ చిత్రాలు నిరూపించాయి. థియేటర్లకు కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో నిర్మాతలు ..దర్శకులు కూడా ఫ్యామిలీ జోనర్పై మళ్లీ దృష్టి సారించారు. ఈ పరిణామం టాలీవుడ్లో ఆరోగ్యకరమైన ట్రెండ్కు తెరతీసిందని చెప్పొచ్చు.
ఈ సక్సెస్ల జోరుతో రాబోయే చిత్రాలపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్ కు చేరుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `ఇరుముడి` , `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` వంటి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త హంగులతో తెరకెక్కుతున్నాయి. `విశ్వనాథ్ అండ్ సన్స్`, `మా ఇంటి బంగారం` బాటలోనే ఈ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధిస్తాయని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
`ఇరుముడి` సినిమా విషయానికి వస్తే యాక్షన్ డ్రామాతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ , డివైన్ టచ్ను జోడించి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. మరోవైపు త్రివిక్రమ్ మార్క్ క్లీన్ ఎంటర్టైనర్గా వస్తోన్న `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు కుటుంబ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న ఫ్యామిలీ ట్రెండ్ రాబోయే ప్రాజెక్ట్లకు పెద్ద ప్లస్ పాయింట్గా మారుతోంది. అయితే అదే సమయంలో ఈ సినిమాలు భారీ అంచనాల ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నాయి. ప్రేక్షకులు కుటుంబ కథలని ఆదరిస్తున్నా? కంటెంట్లో బలమైన భావోద్వేగాలు లేకపోతే ఆదరించడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా ప్రేక్షకులకు హత్తుకునేలా తీర్చిదిద్దేందుకు దర్శకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.