శ్రీవిష్ణు.. థ్రిల్లర్ కథకు పవర్ఫుల్ టైటిల్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో హసన్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వాగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Update: 2024-05-04 03:45 GMT

యంగ్ హీరో శ్రీవిష్ణు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సామజవరగమన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఈ ఏడాది ఓం భీమ్ బుష్ మూవీతో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో హసన్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వాగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీతా ఆర్ట్స్ లో కూడా శ్రీవిష్ణు ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

డైరెక్టర్ బాబీ ప్రొడ్యూసర్ గా మారి శ్రీవిష్ణు హీరోగా SV17 సినిమా చేస్తున్నాడు. కోన వెంకట్ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అలాగే లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లలో మూవీ తెరకెక్కుతోంది. హుస్సేన్ షా కిరణ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ 85 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది.

సామజవరగమన సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా నటించిన రెబ్బా మౌనిక జాన్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'మృత్యుంజయుడు' అనే పవర్ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ టైటిల్ బట్టి చూస్తుంటే కాన్సెప్ట్ ఏదో కొత్తగానే ఉండబోతోందని అనిపిస్తోంది. థ్రిల్లర్ జోనర్ లో సీరియస్ నోట్ లో ఈ కథాంశం ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో కలిసి శ్రీవిష్ణు నుంచి ఈ ఏడాది కనీసం నాలుగు సినిమాల వరకు థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్వాగ్ మూవీ రిలీజ్ కి రంగం సిద్ధం అవుతోంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మృత్యుంజయుడు మూవీ షూటింగ్ కూడా 85 శాతం కంప్లీట్ అయి అయ్యిందంటే ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న సినిమా రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. మొత్తానికి శ్రీవిష్ణు సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మృత్యుంజయుడు మూవీ శ్రీవిష్ణు 17వ చిత్రంగా సిద్ధం అవుతోంది.

Tags:    

Similar News