మనలో ఒకడు.. ఆ రచయిత కూడా పవన్ వెంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గ్యాప్ లేకుండా ప్రచారాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే

Update: 2024-05-10 04:14 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గ్యాప్ లేకుండా ప్రచారాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈసారి ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని చాలా పట్టుదలతోనే కనిపిస్తూ ఉన్నారు. ఇక ఫ్యాన్స్ ఆ విషయంలో ఆయనకు చాలా గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. పిఠాపురంలో ఎక్కడికి వెళ్లినా కూడా జనసేనానికి ఒక రేంజ్ లో వెల్కమ్ అయితే చెబుతున్నారు.

ఇక ఇప్పటికే చాలా మంది సినీ ఆర్టిస్టులు కూడా పవన్ కళ్యాణ్ కు తోడుగా నిలిచి వారి మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొందరు ఏకంగా ప్రచారంలోకి దిగుతూ ఉండడం విశేషం. నిర్మాతలు నాగ వంశీ, SKN అలాగే జబర్దస్త్ ఆర్టిస్ట్ లు హైపర్ ఆది ఇలా చాలామంది పవన్ కళ్యాణ్ విజయం సాధించాలి అని కోరుకుంటూ ఉన్నారు. సినిమాల్లోకి రాకముందే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అని ఇక ఒక ఎమ్మెల్యేగా ఆయన్ను గెలిపిస్తే తప్పకుండా పిఠాపురంకు మంచి జరుగుతుంది అని వివరణ ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా కూడా మరి కొంతమంది వారి మద్దతును అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేస్తూ తమ్ముడు గెలవాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా ద్వారా వారి సంపూర్ణ మద్దతును అందించారు. ఇక ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి కూడా సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు.

Read more!

'మాలో ఒకడు, మనలో ఒకడు మనిషితనానికి ప్రతీక మంచి ఆలోచనలున్న నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో బలిష్టమైన మెజారిటీతో గెలుపొందాలని ఆ శ్రీపాదశ్రీవల్లభుడిని ప్రార్ధిస్తూ.. పరిశ్రమలో ఒకడిగా వారి తరపున పిఠాపురం ప్రజల మద్దతునర్ధిస్తున్నాను..' అని రామ జోగయ్య శాస్త్రి తన వివరణ ఇచ్చారు.

అసలు రాజకీయాలకు చాలా దూరంగా ఉండే రామ జోగయ్య శాస్త్రి ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకడం విశేషం. ఆయన గతంలో పవన్ సినిమాలకు పాటల రచయితగా వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ తో ఆయనకు ప్రత్యేకమైన స్నేహం అనుబంధం ఉంది.. ఇక పవన్ కళ్యాణ్ గురించి చాలా దగ్గరగా ఉండే చాలా మంది ఆర్టిస్టులు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా వారి మద్దతును అందిస్తూ ఉన్నారు.

Tags:    

Similar News