'దేవర'.. ఆ వర్క్ కోసమే 100 కోట్లు
దర్శకుడు కొరటాల శివతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;
దర్శకుడు కొరటాల శివతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్ పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను సీ(సముద్రతీరం) కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్కా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. మ్యూజిక్-సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్- కళ- యాక్షన్ ఇలా అన్ని విభాగాల్లో టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్, కొరియోగ్రాఫర్స్ కూడా ఈ సినిమా కోసం బరిలోకి దిగి పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా వీఎఫెఎక్స్ వర్క్ ప్రారంభించుకుందని తెలిసింది. సినిమాలో ఇప్పటి వరకు చిత్రీకరించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను విడివిడిగా.. కొంతమంది వీఎఫెఎక్స్ ఎక్స్పర్ట్స్ టీమ్స్కు పంపినట్లు సమాచారం అందింది.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్-యువసుధ ఆర్ట్స్ దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇందులో రూ.80 నుంచి రూ.100కోట్ల బడ్జెట్ను కేవలం వీఎఫెఎక్స్ వర్క్ కోసమే ఖర్చు చేయబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలను ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు భారీ సీ సెట్స్ వేసి షెడ్యూళ్లను కూడా పూర్తి చేశారు.
సినిమాలో ఆదిపురుష్ ఫేమ్ 'రావణ్' సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించనుండటం మరో ఆసక్తికర విషయం. అలాగే ఈ చిత్రంతోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటం అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా మారింది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో ఇది రానుంది. అలా ఈ అంశాలన్నీ తారక్ అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచాయి.
ఇకపోతే మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ ఓ సరికొత్త లుక్తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్గా వరల్డ్వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలందిస్తున్నారు. ఆర్.రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహిరస్తున్నారు.