అల్లు అర్జున్-విరాట్ కోహ్లీ : గెలుపును సెలబ్రేట్ చేసుకోని స్టార్స్
ఒకప్పుడు మనల్ని గర్వపడేలా చేసిన తారలను, ఒక్క ప్రమాదం జరిగిన వెంటనే నిందించటం ఎంత న్యాయమో ఆలోచించాల్సిన సమయం ఇది;

ఒకప్పుడు మనల్ని గర్వపడేలా చేసిన తారలను, ఒక్క ప్రమాదం జరిగిన వెంటనే నిందించటం ఎంత న్యాయమో ఆలోచించాల్సిన సమయం ఇది. ఇటీవల జరిగిన రెండు తొక్కిసలాట ఘటనల్లో, ఇద్దరు ప్రముఖులు క్రికెట్ హీరో విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ అనవసరంగా విమర్శల ముప్పేటలో పడిపోవడం బాధాకరం. ఈ సంఘటనలు వారిపై తప్పుడు ఆరోపణలకు దారితీశాయి, అసలు బాధ్యత ఎవరిదో పక్కన పెట్టి వీరిని టార్గెట్ చేశాయి.
- విరాట్ కోహ్లీ గెలుపు వేడుక మిగిలించిన గాయాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా IPL ట్రోఫీ గెలిచింది. ఆ జట్టు ఆశల వెలుగు విరాట్ కోహ్లీ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుక తర్వాత జరిగిన తొక్కిసలాట దుర్ఘటన వల్ల కోహ్లీపై అనవసరమైన విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ వేడుక గెలుపు తర్వాత కేవలం 15 గంటల్లోనే ఏర్పాటు చేయడం, పోలీసులకు తగిన సమయం లేకపోవడం వంటివి స్పష్టంగా నిర్వహణలో లోపాలే. అయినప్పటికీ కోహ్లీని ఇంతలా లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు న్యాయం? ఆయన స్టేడియంలో ఉండడం తప్ప ఆయన ఎటువంటి నిర్ణయంలోనూ భాగస్వామి కాదని అందరికీ తెలిసిన విషయమే. తన భవనం వెళ్లే ముందు అభిమానుల కోరిక మేరకే కార్యక్రమం ఏర్పాటు చేసారని సమాచారం. అయినా సరే, క్షణాల్లో హీరోను విలన్ చేయడం మనకు తగిన దారికాదేమో.
-అల్లు అర్జున్ – పుష్ప 2 ప్రమోషన్ ఘటన
ఇలాంటి మరొక ఉదంతం హైదరాబాద్లో 'పుష్ప 2' రిలీజ్ వేళ జరిగింది. అల్లు అర్జున్ అభిమానులు వేల సంఖ్యలో రావడంతో ఏర్పడిన తొక్కిసలాటలో కొంతమంది గాయపడ్డారు. అయితే వెంటనే ఈ ఘటనపై బహిరంగంగా అల్లు అర్జున్ను నిందించడం మొదలైంది. ఈ కార్యక్రమానికి అనుమతులు, భద్రతా ఏర్పాట్లు.. ఇవన్నీ ప్రభుత్వ, పోలీస్ శాఖల ఆధీనంలో ఉండే విషయాలు. అల్లు అర్జున్ వచ్చి అభిమానులకు అభినందనలు చెప్పినందుకే తప్పయిందా? లేదా నిర్వాహక లోపమే కారణమా? అనేది బహిరంగ విచారణలో తేల్చాల్సిన విషయం.
- ప్రసిద్ధులపై నిందలు సరైనదేనా?
ఈ రెండు ఘటనలలోనూ అసలు తప్పు చేసినవాళ్లెవరు అన్నదానిపై దృష్టి పెట్టకుండా, ప్రజలకి తెలిసిన ముఖాలు కనబడగానే వారిపై నిందలు వేయడం అన్యాయమనే చెప్పాలి. కోహ్లీ, అల్లు అర్జున్ ఇద్దరూ తమ తమ స్థాయిలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తగిన సమయానికే స్పందించారు కూడా. కానీ తక్షణంగా వీరినే బాధ్యులుగా చూపించడం సరైంది కాదని ప్రతి సామాన్యుడూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండే విధంగా పాఠాలు నేర్పుకోవాలి. కానీ ప్రజల అభిమానాలను, వారి బాధ్యతను ప్రయోజనార్థంగా వాడుకునే వాతావరణం — అది ఎంత ప్రమాదకరమో గుర్తించాలి.
ప్రముఖులపై విమర్శలు చేసే ముందు, వారి పాత్ర ఏంటి? బాధ్యత ఎవరిదీ? అనే విషయాలు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్ లాంటి తారలు మన గర్వకారణాలు. వారిని తక్కువ చేయడం కాకుండా, సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించడమే సమాజ బాధ్యత.